Political News

ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో పాలక పక్షాలు మారిపోతున్నాయి.

కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అటుఇటూ మారిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యంగా మారగా…అది టీడీపీ ఖాతాలో చేరిపోనుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా వైరి వర్గాల నుంచి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయితే అందుకు విరుద్ధంగా టీడీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఇబ్బంది తలెత్తుతోంది. నందిగామ నగర పంచాయతీ చైర్ పర్సన్ పదవికి శాఖమూరి స్వర్ణలత పేరును ఖరారు చేసింది.

అయితే స్తానిక ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్య మాత్రం స్వర్ణలత అభ్యర్థిత్వానికి ససేమిరా అంటున్నారు. అధిష్ఠానాన్ని సంప్రదించకుండానే… పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ సత్యవతికి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించాలని సౌమ్య నిర్ణయించినట్లుగా సమాచారం.

ఈ విషయం తెలిసిన స్థానిక ఎంపీ కేశినేని చిన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని ఎమ్మెల్యేకు సూచించారట. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎందుకు సంప్రదించరంటూ సౌమ్మ ప్రశ్నించారట. స్థానిక ఎమ్మెల్యేగా తాను ఇప్పటికే సత్యవతికి మాట ఇచ్చానని, ఆమె అభ్యర్థిత్వానికే పార్టీ అనుమతి ఇవ్వాలని కోరారట.

అయితే అధిష్ఠానం ఓ అభ్యర్థిని నిర్ణయించాక మళ్లీ మార్చడం అంటూ ఉండదని, స్వర్ణలత అభ్యర్థిత్వానికే ఒప్పుకుని తీరాలని చిన్ని చెప్పారట. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సౌమ్య సోమవారం జరగాల్సిన చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడేలా చేశారట. మరి మంగళవారమైనా ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.

This post was last modified on February 3, 2025 4:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

44 minutes ago

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

3 hours ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

8 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

9 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

9 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

9 hours ago