తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా.. బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కామెంట్లను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన ట్వీట్ లో కేటీఆర్ ఏమన్నారంటే… పార్టీ ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ ఇక ఎంతమాత్రం కాపాడుకోలేదు. చట్టాన్ని గుర్తు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉప ఎన్నికలు ఇక తథ్యమేనని తేలిపోయింది. వాటికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో దాదాపుగా 10 మంది ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
తమ పార్టీ గుర్తులపై పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన వారి సభ్యత్వాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ ను కోరింది. స్పీకర్ కార్యాలయం నుంచి ఆశించిన మేర స్పందన కనిపించని నేపథ్యంలో…బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత వారం దీనిపై జరిగిన విచారణ సందర్భంగా స్పీకర్ కార్యాలయం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడమంటే… చర్యలు తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ గడువు అంటే మహారాష్ట్రలో మాదిరిగా అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకా? అని కూడా కోర్టు ప్రశ్నించింది.
This post was last modified on February 3, 2025 3:16 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…