Political News

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా.. బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కామెంట్లను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

తన ట్వీట్ లో కేటీఆర్ ఏమన్నారంటే… పార్టీ ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ ఇక ఎంతమాత్రం కాపాడుకోలేదు. చట్టాన్ని గుర్తు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉప ఎన్నికలు ఇక తథ్యమేనని తేలిపోయింది. వాటికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో దాదాపుగా 10 మంది ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

తమ పార్టీ గుర్తులపై పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన వారి సభ్యత్వాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ ను కోరింది. స్పీకర్ కార్యాలయం నుంచి ఆశించిన మేర స్పందన కనిపించని నేపథ్యంలో…బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత వారం దీనిపై జరిగిన విచారణ సందర్భంగా స్పీకర్ కార్యాలయం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడమంటే… చర్యలు తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ గడువు అంటే మహారాష్ట్రలో మాదిరిగా అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకా? అని కూడా కోర్టు ప్రశ్నించింది.

This post was last modified on February 3, 2025 3:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: CongressKTR

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

14 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago