Political News

జ‌గ‌న్ ఎంట్రీ.. వైసీపీలో మిస్సింగ్స్‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వ‌స్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న నాలుగు రోజుల కింద‌టే బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకున్నారు. అక్క‌డ నుంచి నేరుగా బెంగ‌ళూరు ప్యాల‌స్‌కు చేరుకున్నారు. విశ్రాంతి అనంత‌రం.. తాజాగా సోమ‌వారం తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో భారీ ఎత్తున జోష్ క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అనుకుంటారు. మా నాయ‌కుడొచ్చాడంటూ.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటార‌ని కూడా భావిస్తారు. కానీ, అలాంటిదేమీ లేకుండానే నాయ‌కులు చూచాయ‌గానే స్పందించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఒక‌ప్పుడు జ‌గ‌న్ ఎక్క‌డ‌కు వెళ్లినా..ఎక్క‌డ నుంచి వ‌చ్చినా మందీ మార్బ‌లం భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికేది. అదేవిధంగా ఆయనకు భారీ ఎత్తున మ‌ర్యాద‌లు కూడా ద‌క్కేవి. కానీ, 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన త‌ర్వాత ఈ మార్యాద‌లు త‌గ్గుతూ వ‌చ్చాయి. ఘోర ప‌రాజ‌యం నుంచి పార్టీ నేత‌లు.. తేరుకోలేక పోవ‌డం, ఈ మొత్తం ఓట‌మికి జ‌గ‌న్ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మే కార‌ణ‌మ‌ని వారు భావిస్తున్న క్ర‌మంలో నాయ‌కుల్లో అసంతృప్తి సెగ‌లు ర‌గులుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ వ‌స్తున్నారంటే.. ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు ఉన్న గౌర‌వ మ‌ర్యాదలు కూడా క‌నిపించ‌డం లేదు.

బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌కు ముందు.. క‌డ‌ప‌ జిల్లాకు వెళ్లిన జ‌గ‌న్‌కు.. అక్క‌డ సీనియ‌ర్ నేత‌ల నుంచి ఎలాంటి గౌర‌వం ద‌క్కిందో అంద‌రికీ తెలిసింది. వారి రాక‌కోసం ఆయ‌న ఎదురు చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. చిన్నా చిత‌కా నాయ‌కులు, అస‌లు జ‌గ‌న్ ముందు నిల‌బ‌డేందుకు కూడా ఇబ్బంది ప‌డే కార్య‌క‌ర్త‌లే ఆ రోజు పెద్ద నేత‌లుగా చ‌లామ‌ణి అయ్యారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చు. ఓట‌మికి తోడు.. ఎలాంటి వ్యూహం లేకుండా గ‌త 7 మాసాలుగా సాగుతున్న ప్ర‌యాణం.. పార్టీలో పెరుగుతు న్న అసంతృప్తుల‌ను త‌గ్గించ‌లేక పోవ‌డం.. వంటివి కూడా జ‌గ‌న్ ఇమేజ్ విష‌యంలో సొంత పార్టీ నాయ‌కులే త‌క్కువ చేస్తున్న ప‌రిస్థితి ఉంది.

అదే.. ఇప్పుడు కూడా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఎంట్రీ ఇస్తున్నారంటే.. తాడేప‌ల్లిలోని పెద్ద‌లు కూడా కిమ్మ‌న‌కుండా కూర్చున్నారు. వ‌స్తే రానీ.. అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. వైసీపీ వ్యవ‌హారాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు ఇచ్చిన‌, ప్ర‌స్తుతం ఇస్తున్న మ‌ర్యాద‌ల్లో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు ఆయ‌న ముందు నిల‌బ‌డేందుకు క్యూ క‌ట్టిన నాయ‌కులు కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. ఒక‌ప్పుడు జ‌గ‌న్ ద‌ర్శ‌నం కోసం అల్లాడిన వారు కూడా ఇప్పుడు ఆయ‌న‌కు క‌నిపించ‌డ‌మే లేదు. సో.. ఇదీ ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి!!

This post was last modified on February 3, 2025 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

58 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

1 hour ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago