టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడ్డాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే నవ్వినవ్వి చస్తే బాధ్యత మాది కాదు అంటూ మరింతగా పేట్రేగిపోయారు. ఆ ట్రోలింగ్ కు రాయచోటికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువరాజు యాదవ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన తనదైన సమాధానంతో ట్రోలర్ల నోళ్లకు ఇట్టే తాళం వేసి పారేశారు.
చంద్రబాబు తన టూర్ లో భాగంగా అక్కడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ మాట్లాడుతూ తానో సాఫ్ట్ వేర్ ఉద్యోగినని, ఏడాదికి రూ.93 లక్షల వేతనాన్ని తీసుకుంటున్నానని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం పద్దతిన ఇంటి వద్ద ,నుంచే పనిచేస్తున్నానని చెప్పారు. ఈ వీడయో అలా ప్రసారమైందో, లేదో.. సోషల్ మీడియాలో ఇలా ట్రోలింగ్ షురూ అయిపోయింది. ఆ కంపెనీ పేరు ఏమిటో చెబితే మేమూ చేరిపోతామని కొందరంటే… బెంగళూరులో ఆ స్థాయిలో వేతనాలు ఇస్తున్నారా? అంటూ మరికొందరు వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ ట్రోలింగ్ ను అంతా ఓపిగ్గానే విన్న యాదవ్.. తీరిగ్గా తన రిప్లైని పోస్ట్ చేసి ట్రోలర్లు అందిరికీ షాకిచ్చారు.
యువరాజు యాదవ్ తన స్పందనను ఓ వీడియో రూపంలో చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా కంపెనీ పేరును మాత్రం వెల్లడించలేనని చెప్పిన యాదవ్… తన శాలరీ స్లిప్పులతో పాటు తాను కడుతున్న ఐటీకి సంబందించిన ఆధారాలను బయటపెట్టారు. “రూ.93 లక్షలని చెప్పిన నా వేతనం వాస్తవానికి రూ.96 లక్షలు. కేవలం నాలుగు లక్షలు తక్కువ అక్షరాలా కోటి రూపాయలు. అందులో డిడక్షన్ ను తొలగించి రూ.83 లక్షలు అని చెప్పాను.అయినా నా శాలరీపై పడి ఏడవడం కాదు. వాస్తవాలు తెలుసుకోండి. చదువు ఎవడబ్బ సొత్తు కాదు. కోటి జీతం తీసుకుంటే సూటు బూటు వేసుకునే రావాలా?” అంటూ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on February 2, 2025 3:48 pm
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…