Political News

మోడీ సంక‌ల్పం నెర‌వేరాలి: బ‌డ్జెట్‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బ‌డ్జెట్‌లో దేశ బ‌హుముఖాభివృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా దేశ అభివృద్దిని కాంక్షిస్తూ.. రూపొందించిన ఈ బ‌డ్జెట్ ద్వారా మోడీ ఆశ‌యాలు సిద్ధించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు తెలిపారు. ముఖ్యంగా విక‌సిత భార‌త్ ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హిళ‌లు, పేద‌లు, రైతులు, యువ‌త కేంద్రంగా తీసుకున్న నిర్ణ‌యాలు, చేసిన ప్ర‌క‌ట‌న‌లు కూడా ఆయా వ‌ర్గాల‌కు మేలు చేస్తాయ‌ని తెలిపారు.

“రాజ‌కీయాల‌కంటే కూడా.. దేశం, ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మ‌న్న అత్యున్న‌త దృక్ఫ‌థం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. స‌మాజంలోని దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన కూర్పుగా బ‌డ్జెట్‌ను ఆయ‌న అభివ‌ర్ణించారు. ఉద్యోగుల‌కు 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్నును మిన‌హాయించ‌డాన్ని చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యంగా పేర్కొన్నారు. పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ స్థితిగ‌తులు మారుతాయ‌ని చెప్పారు. ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల బెడ‌ద నుంచి రైతుల‌ను కాపాడేందు కురుణ స‌దుపాయాన్ని పెంచ‌డం ముదావ‌హ‌మ‌ని పేర్కొన్నారు. 2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌న్న‌కారు రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.

ఏపీ విష‌యంలోనూ కేంద్ర బ‌డ్జెట్‌లో మంచి కేటాయింపులు జ‌రిపార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ముఖ్యంగా ఏపీ జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాలు ఆమోదించ‌డం, బ‌కాయిల‌కు ఆమోదం తెల‌ప‌డం వంటివి ఏపీలో జ‌ల వ‌న‌రుల ప్రాజెక్టుల‌కు ఊత‌మిచ్చింద‌న్నారు. విశాఖ ఉక్కు, పోర్టుల‌కు కూడా బ‌డ్జెట్‌ల కేటాయింపులు జ‌రిగాయ‌ని, దీంతో ఆయా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. 3295 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం ద్వారా విశాఖ ఉక్కుకు జీవం పోశార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం పుంజుకునేందుకు, రాష్ట్రంలో అభివృద్ధి సాగేందుకు ఈ బ‌డ్జెట్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

This post was last modified on February 2, 2025 12:29 pm

Share

Recent Posts

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

11 minutes ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

51 minutes ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

2 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

2 hours ago

నిర్మాతగా కాజల్ అగర్వాల్… సినిమా ఎలా ఉంది

ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…

2 hours ago

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

4 hours ago