Political News

మోడీ సంక‌ల్పం నెర‌వేరాలి: బ‌డ్జెట్‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బ‌డ్జెట్‌లో దేశ బ‌హుముఖాభివృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా దేశ అభివృద్దిని కాంక్షిస్తూ.. రూపొందించిన ఈ బ‌డ్జెట్ ద్వారా మోడీ ఆశ‌యాలు సిద్ధించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు తెలిపారు. ముఖ్యంగా విక‌సిత భార‌త్ ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హిళ‌లు, పేద‌లు, రైతులు, యువ‌త కేంద్రంగా తీసుకున్న నిర్ణ‌యాలు, చేసిన ప్ర‌క‌ట‌న‌లు కూడా ఆయా వ‌ర్గాల‌కు మేలు చేస్తాయ‌ని తెలిపారు.

“రాజ‌కీయాల‌కంటే కూడా.. దేశం, ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మ‌న్న అత్యున్న‌త దృక్ఫ‌థం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. స‌మాజంలోని దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన కూర్పుగా బ‌డ్జెట్‌ను ఆయ‌న అభివ‌ర్ణించారు. ఉద్యోగుల‌కు 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్నును మిన‌హాయించ‌డాన్ని చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యంగా పేర్కొన్నారు. పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ స్థితిగ‌తులు మారుతాయ‌ని చెప్పారు. ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల బెడ‌ద నుంచి రైతుల‌ను కాపాడేందు కురుణ స‌దుపాయాన్ని పెంచ‌డం ముదావ‌హ‌మ‌ని పేర్కొన్నారు. 2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌న్న‌కారు రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.

ఏపీ విష‌యంలోనూ కేంద్ర బ‌డ్జెట్‌లో మంచి కేటాయింపులు జ‌రిపార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ముఖ్యంగా ఏపీ జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాలు ఆమోదించ‌డం, బ‌కాయిల‌కు ఆమోదం తెల‌ప‌డం వంటివి ఏపీలో జ‌ల వ‌న‌రుల ప్రాజెక్టుల‌కు ఊత‌మిచ్చింద‌న్నారు. విశాఖ ఉక్కు, పోర్టుల‌కు కూడా బ‌డ్జెట్‌ల కేటాయింపులు జ‌రిగాయ‌ని, దీంతో ఆయా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. 3295 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం ద్వారా విశాఖ ఉక్కుకు జీవం పోశార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం పుంజుకునేందుకు, రాష్ట్రంలో అభివృద్ధి సాగేందుకు ఈ బ‌డ్జెట్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

This post was last modified on February 2, 2025 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

37 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

51 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago