రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. రాజకీయాల్లో ఉండగా… నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సాయిరెడ్డి…ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మీడియా అటెన్షన్ లేకుండా సాగలేకపోతున్నట్లుగా ఉంది. రాజకీయ సన్యాసం తర్వాత సాగులోకి దిగుతున్నానంటూ ఇటీవలే తన వ్యవసాయ క్షేత్రంలో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో సాయిరెడ్డి భేటీ అయ్యారట. 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లిన సాయిరెడ్డి… షర్మిలతో ఏకంగా 3 గంటలకు పైగా షర్మిలతో భేటీ అయ్యారట. షర్మిలతో కలిసి అక్కడే హద్యాహ్న భోజనం కూడా చేశారట. ఈ సందర్భంగా షర్మిలతో ఆయన ురాజకీయాలపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అత్యంత రహస్యంగానే జరిగినా… రెండు రోజులకే ఈ బేటీ గురించి బయటకు తెలిసిపోయింది. సాయిరెడ్డి ద్వారానే ఈ సమాచారం బయటకు పొక్కినట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికి జగన్, షర్మిల ఇద్దరితోనూ సఖ్యతగానే సగిన సాయిరెడ్డి… వారిద్దరి మధ్య వివాదాలు రావడంతో జగన్ వెంటే నడిచారు. అంతేకాకుండా షర్మిలను టార్టెట్ చేస్తూ సాయిరెడ్డి ఒకింత ఘాటు ఆరోపణలే చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ విజయయ్యపైనా సెటైర్లు సంధించారు. మొత్తంగా తనకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన సాయిరెడ్డి… షర్మిలను మాత్రం ఓ రేంజిలో టార్గెట్ చేశారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి విమర్శలు సంధించిన సందర్భాలు కోకొల్లలు. ఇదే విషాయన్ని ఇటీవలే షర్మిల స్వయంగా బయటపెట్టారు కూడా. తననే కాకుండా తన పిల్లలను కూడా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి అబద్ధాలు చెప్పారంటూ ఆమె విరుచుకుపడ్డారు.
అయితే జగన్ నుంచి… .పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా జరిగిన సాయిరెడ్డి ఇప్పుడు నేరుగా షర్మిలతో బేటీ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఆడిటర్ గా వైఎస్ ఫ్యామిలీలో అందరితోనూ సత్సంబంధాలే కలిగిన సాయిరెడ్డి… షర్మిలతో భేటీ పెద్ద విషయం కాకున్నా… రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఆమె వద్దకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా సుదీర్ఘంగా ఆమెతో భేటీ కావడం చూస్తుంటే.. అన్నను వదిలేసిన సాయిరెడ్డి ఇప్పుడు చెల్లితో రాజకీయం చేద్దామనుకుంటున్నారా? అన్న దిశగా ఆసక్తికర సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on February 2, 2025 10:27 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…