రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. రాజకీయాల్లో ఉండగా… నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సాయిరెడ్డి…ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మీడియా అటెన్షన్ లేకుండా సాగలేకపోతున్నట్లుగా ఉంది. రాజకీయ సన్యాసం తర్వాత సాగులోకి దిగుతున్నానంటూ ఇటీవలే తన వ్యవసాయ క్షేత్రంలో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో సాయిరెడ్డి భేటీ అయ్యారట. 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లిన సాయిరెడ్డి… షర్మిలతో ఏకంగా 3 గంటలకు పైగా షర్మిలతో భేటీ అయ్యారట. షర్మిలతో కలిసి అక్కడే హద్యాహ్న భోజనం కూడా చేశారట. ఈ సందర్భంగా షర్మిలతో ఆయన ురాజకీయాలపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అత్యంత రహస్యంగానే జరిగినా… రెండు రోజులకే ఈ బేటీ గురించి బయటకు తెలిసిపోయింది. సాయిరెడ్డి ద్వారానే ఈ సమాచారం బయటకు పొక్కినట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికి జగన్, షర్మిల ఇద్దరితోనూ సఖ్యతగానే సగిన సాయిరెడ్డి… వారిద్దరి మధ్య వివాదాలు రావడంతో జగన్ వెంటే నడిచారు. అంతేకాకుండా షర్మిలను టార్టెట్ చేస్తూ సాయిరెడ్డి ఒకింత ఘాటు ఆరోపణలే చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ విజయయ్యపైనా సెటైర్లు సంధించారు. మొత్తంగా తనకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన సాయిరెడ్డి… షర్మిలను మాత్రం ఓ రేంజిలో టార్గెట్ చేశారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి విమర్శలు సంధించిన సందర్భాలు కోకొల్లలు. ఇదే విషాయన్ని ఇటీవలే షర్మిల స్వయంగా బయటపెట్టారు కూడా. తననే కాకుండా తన పిల్లలను కూడా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి అబద్ధాలు చెప్పారంటూ ఆమె విరుచుకుపడ్డారు.
అయితే జగన్ నుంచి… .పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా జరిగిన సాయిరెడ్డి ఇప్పుడు నేరుగా షర్మిలతో బేటీ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఆడిటర్ గా వైఎస్ ఫ్యామిలీలో అందరితోనూ సత్సంబంధాలే కలిగిన సాయిరెడ్డి… షర్మిలతో భేటీ పెద్ద విషయం కాకున్నా… రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఆమె వద్దకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా సుదీర్ఘంగా ఆమెతో భేటీ కావడం చూస్తుంటే.. అన్నను వదిలేసిన సాయిరెడ్డి ఇప్పుడు చెల్లితో రాజకీయం చేద్దామనుకుంటున్నారా? అన్న దిశగా ఆసక్తికర సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on February 2, 2025 10:27 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…