Political News

అవును.. అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఆయన్న ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వివిధ కమిటీలను కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారి.. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాధ్యతలను అప్పట్నుంచి రమణే చూస్తుండగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఐతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కళా వెంకట్రావు అంత చురుగ్గా లేరు. ఇక కొన్ని నెలల కిందట మందుల కొనుగోలుకు సంబంధించి అక్రమాల్లో భాగమయ్యారంటూ అచ్చెన్నాయుడిని వైకాపా సర్కారు అరెస్టు చేసింది. దీని మీద రాజకీయంగా పెద్ద రగడే నడిచింది. అచ్చెన్నాయుడి కోసం టీడీపీ గట్టిగానే పోరాడింది. ఆయనకు అండగా నిలిచింది.

అచ్చెన్నాయుడిపై ప్రస్తుతం జనాల్లో సానుభూతి ఉందన్న అభిప్రాయం టీడీపీలో ఉంది. అలాగే వైకాపాను బలంగా ఢీకొట్టడానికి, ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి అచ్చెన్నాయుడి లాంటి బలమైన నేత అవసరం ఉందని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే ఆయన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ అచ్చెన్నను అధికారికంగా ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

This post was last modified on October 20, 2020 8:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

42 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago