Political News

అవును.. అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఆయన్న ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వివిధ కమిటీలను కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారి.. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాధ్యతలను అప్పట్నుంచి రమణే చూస్తుండగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఐతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కళా వెంకట్రావు అంత చురుగ్గా లేరు. ఇక కొన్ని నెలల కిందట మందుల కొనుగోలుకు సంబంధించి అక్రమాల్లో భాగమయ్యారంటూ అచ్చెన్నాయుడిని వైకాపా సర్కారు అరెస్టు చేసింది. దీని మీద రాజకీయంగా పెద్ద రగడే నడిచింది. అచ్చెన్నాయుడి కోసం టీడీపీ గట్టిగానే పోరాడింది. ఆయనకు అండగా నిలిచింది.

అచ్చెన్నాయుడిపై ప్రస్తుతం జనాల్లో సానుభూతి ఉందన్న అభిప్రాయం టీడీపీలో ఉంది. అలాగే వైకాపాను బలంగా ఢీకొట్టడానికి, ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి అచ్చెన్నాయుడి లాంటి బలమైన నేత అవసరం ఉందని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే ఆయన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ అచ్చెన్నను అధికారికంగా ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

This post was last modified on October 20, 2020 8:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

41 minutes ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

4 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

5 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

5 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

7 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

8 hours ago