Political News

ఆదాయ‌పన్ను ఎంత‌? ఎవ‌రికి మిన‌హాయింపు?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో వేత‌న జీవులు ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే మేలు జ‌రిగింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌రకు ఉన్న ‘పాత ప‌న్ను’ విధానంలో 5 -7 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం ప‌న్ను ప‌రిమితిని పెంచాల‌ని చెబుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2021లో కొత్త ఆదాయ ప‌న్ను విధానాన్ని తీసుకువ‌చ్చారు. దీనిని కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు 7.5 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు. కానీ, దీని వైపు మొగ్గు చూపేందుకు ఉద్యోగులు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం.. కొత్త ప‌న్ను విధానంలో 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితిని పెంచింది. అంటే.. ఎవ‌రైనా ఉద్యోగి.. ఏడాదికి రూ.12 ల‌క్ష‌లు సంపాయిస్తే.. రూపాయి కూడా ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇక్క‌డ ఆదాయం అంటే.. అర్ధం మారుతుంది. ఆదాయం అంటే.. వ్య‌క్తిగ‌త ఆదాయ‌మే కాదు.. కుటుంబ ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి.. వ్య‌క్తిగ‌త ఆదాయం ఏడాది రూ.8 ల‌క్ష‌లు సంపాయిస్తున్నార‌ని అనుకుంటే.. ఆయ‌న‌కు ఇంటి అద్దెలు, బ్యాంకులో పొదుపుల‌పై వ‌స్తున్న వ‌డ్డీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌స్తున్న వ‌డ్డీ.. ఇత‌ర రూపాల్లో స‌మ‌కూరే ఆదాయాల‌ను ఇప్పుడు లెక్కిస్తారు.

ఇవ‌న్నీ క‌లిపినా.. రూ.12 ల‌క్ష‌ల‌కు మించ‌క‌పోతే.. రూపాయి కూడా వ‌డ్డీ తీసుకోరు. కానీ, 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించితే మాత్రం ప‌న్నులు త‌ప్పవు. అయితే.. ఇక్క‌డ కూడా కొంత ఊర‌ట ఉంది. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించి ఆదాయం పొందుతున్న వారికి కూడా.. తొలి 4 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఎలాంటి ఆదాయ ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అదేవిధంగా 4 ల‌క్ష‌ల త‌ర్వాత‌.. మ‌రో 75 వేల వ‌ర‌కు.. ఎల్ ఐసీలు, పొదుపు ఖాతాల‌ను చూపించుకోవ‌చ్చు. అంటే.. మొత్తంగా 4.75 ల‌క్షల వ‌ర‌కు ఎలాంటి ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

కానీ, ఆ త‌ర్వాత మాత్రం శ్లాబుల వారీగా లెక్కించి ప‌న్నులు వ‌సూలు చేస్తారు.

  • 4.75 ల‌క్ష‌ల నుంచి – 8 ల‌క్ష‌ల వ‌ర‌కు 5 శాతం(16,250 ప‌న్ను చెల్లించాలి)
  • 8-12 ల‌క్ష‌ల వ‌ర‌కు 10 శాతం
  • 12-16 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం
  • 16-20 ల‌క్ష‌ల వ‌ర‌కు 20 శాతం
  • 20-24 ల‌క్ష‌ల వ‌ర‌కు 25 శాతం
  • 24 ల‌క్ష‌ల నుంచి ఎంత ఆదాయం ఉన్నా.. 30 శాతం ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది.

This post was last modified on February 1, 2025 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

56 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago