Political News

ఆదాయ‌పన్ను ఎంత‌? ఎవ‌రికి మిన‌హాయింపు?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో వేత‌న జీవులు ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే మేలు జ‌రిగింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌రకు ఉన్న ‘పాత ప‌న్ను’ విధానంలో 5 -7 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం ప‌న్ను ప‌రిమితిని పెంచాల‌ని చెబుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2021లో కొత్త ఆదాయ ప‌న్ను విధానాన్ని తీసుకువ‌చ్చారు. దీనిని కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు 7.5 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు. కానీ, దీని వైపు మొగ్గు చూపేందుకు ఉద్యోగులు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం.. కొత్త ప‌న్ను విధానంలో 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితిని పెంచింది. అంటే.. ఎవ‌రైనా ఉద్యోగి.. ఏడాదికి రూ.12 ల‌క్ష‌లు సంపాయిస్తే.. రూపాయి కూడా ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇక్క‌డ ఆదాయం అంటే.. అర్ధం మారుతుంది. ఆదాయం అంటే.. వ్య‌క్తిగ‌త ఆదాయ‌మే కాదు.. కుటుంబ ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి.. వ్య‌క్తిగ‌త ఆదాయం ఏడాది రూ.8 ల‌క్ష‌లు సంపాయిస్తున్నార‌ని అనుకుంటే.. ఆయ‌న‌కు ఇంటి అద్దెలు, బ్యాంకులో పొదుపుల‌పై వ‌స్తున్న వ‌డ్డీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌స్తున్న వ‌డ్డీ.. ఇత‌ర రూపాల్లో స‌మ‌కూరే ఆదాయాల‌ను ఇప్పుడు లెక్కిస్తారు.

ఇవ‌న్నీ క‌లిపినా.. రూ.12 ల‌క్ష‌ల‌కు మించ‌క‌పోతే.. రూపాయి కూడా వ‌డ్డీ తీసుకోరు. కానీ, 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించితే మాత్రం ప‌న్నులు త‌ప్పవు. అయితే.. ఇక్క‌డ కూడా కొంత ఊర‌ట ఉంది. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించి ఆదాయం పొందుతున్న వారికి కూడా.. తొలి 4 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఎలాంటి ఆదాయ ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అదేవిధంగా 4 ల‌క్ష‌ల త‌ర్వాత‌.. మ‌రో 75 వేల వ‌ర‌కు.. ఎల్ ఐసీలు, పొదుపు ఖాతాల‌ను చూపించుకోవ‌చ్చు. అంటే.. మొత్తంగా 4.75 ల‌క్షల వ‌ర‌కు ఎలాంటి ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

కానీ, ఆ త‌ర్వాత మాత్రం శ్లాబుల వారీగా లెక్కించి ప‌న్నులు వ‌సూలు చేస్తారు.

  • 4.75 ల‌క్ష‌ల నుంచి – 8 ల‌క్ష‌ల వ‌ర‌కు 5 శాతం(16,250 ప‌న్ను చెల్లించాలి)
  • 8-12 ల‌క్ష‌ల వ‌ర‌కు 10 శాతం
  • 12-16 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం
  • 16-20 ల‌క్ష‌ల వ‌ర‌కు 20 శాతం
  • 20-24 ల‌క్ష‌ల వ‌ర‌కు 25 శాతం
  • 24 ల‌క్ష‌ల నుంచి ఎంత ఆదాయం ఉన్నా.. 30 శాతం ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది.

This post was last modified on February 1, 2025 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago