కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న ‘పాత పన్ను’ విధానంలో 5 -7 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండర్డ్ డిడక్షన్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం పన్ను పరిమితిని పెంచాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2021లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా నిన్న మొన్నటి వరకు 7.5 లక్షలుగా పేర్కొన్నారు. కానీ, దీని వైపు మొగ్గు చూపేందుకు ఉద్యోగులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం.. కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచింది. అంటే.. ఎవరైనా ఉద్యోగి.. ఏడాదికి రూ.12 లక్షలు సంపాయిస్తే.. రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. ఇక్కడ ఆదాయం అంటే.. అర్ధం మారుతుంది. ఆదాయం అంటే.. వ్యక్తిగత ఆదాయమే కాదు.. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి.. వ్యక్తిగత ఆదాయం ఏడాది రూ.8 లక్షలు సంపాయిస్తున్నారని అనుకుంటే.. ఆయనకు ఇంటి అద్దెలు, బ్యాంకులో పొదుపులపై వస్తున్న వడ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వస్తున్న వడ్డీ.. ఇతర రూపాల్లో సమకూరే ఆదాయాలను ఇప్పుడు లెక్కిస్తారు.
ఇవన్నీ కలిపినా.. రూ.12 లక్షలకు మించకపోతే.. రూపాయి కూడా వడ్డీ తీసుకోరు. కానీ, 12 లక్షల రూపాయలకు మించితే మాత్రం పన్నులు తప్పవు. అయితే.. ఇక్కడ కూడా కొంత ఊరట ఉంది. 12 లక్షల రూపాయలకు మించి ఆదాయం పొందుతున్న వారికి కూడా.. తొలి 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 4 లక్షల తర్వాత.. మరో 75 వేల వరకు.. ఎల్ ఐసీలు, పొదుపు ఖాతాలను చూపించుకోవచ్చు. అంటే.. మొత్తంగా 4.75 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కానీ, ఆ తర్వాత మాత్రం శ్లాబుల వారీగా లెక్కించి పన్నులు వసూలు చేస్తారు.
This post was last modified on February 1, 2025 6:26 pm
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. రణ్బీర్ కపూర్ ‘యానిమల్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, రీసెంట్…
మార్చి నెలలో దురంధర్ ది రివెంజ్ కనక ఆదుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి మరింత అన్యాయంగా ఉండేది.…
తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు…
ఇరాన్ తో మనకున్న బంధం.. అనుబంధం చాలా కీలకమైనదని.. మన స్నేహం దశాబ్దాల తరబడి సాగుతోందని చెప్పే మాటలకు.. చేతలకు…
నిన్న చెన్నై లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ రిలీజయ్యింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా జంటగా నటిస్తున్న…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఇప్పుడో అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…