Political News

ఆదాయ‌పన్ను ఎంత‌? ఎవ‌రికి మిన‌హాయింపు?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో వేత‌న జీవులు ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే మేలు జ‌రిగింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌రకు ఉన్న ‘పాత ప‌న్ను’ విధానంలో 5 -7 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం ప‌న్ను ప‌రిమితిని పెంచాల‌ని చెబుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2021లో కొత్త ఆదాయ ప‌న్ను విధానాన్ని తీసుకువ‌చ్చారు. దీనిని కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు 7.5 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు. కానీ, దీని వైపు మొగ్గు చూపేందుకు ఉద్యోగులు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం.. కొత్త ప‌న్ను విధానంలో 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితిని పెంచింది. అంటే.. ఎవ‌రైనా ఉద్యోగి.. ఏడాదికి రూ.12 ల‌క్ష‌లు సంపాయిస్తే.. రూపాయి కూడా ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇక్క‌డ ఆదాయం అంటే.. అర్ధం మారుతుంది. ఆదాయం అంటే.. వ్య‌క్తిగ‌త ఆదాయ‌మే కాదు.. కుటుంబ ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి.. వ్య‌క్తిగ‌త ఆదాయం ఏడాది రూ.8 ల‌క్ష‌లు సంపాయిస్తున్నార‌ని అనుకుంటే.. ఆయ‌న‌కు ఇంటి అద్దెలు, బ్యాంకులో పొదుపుల‌పై వ‌స్తున్న వ‌డ్డీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌స్తున్న వ‌డ్డీ.. ఇత‌ర రూపాల్లో స‌మ‌కూరే ఆదాయాల‌ను ఇప్పుడు లెక్కిస్తారు.

ఇవ‌న్నీ క‌లిపినా.. రూ.12 ల‌క్ష‌ల‌కు మించ‌క‌పోతే.. రూపాయి కూడా వ‌డ్డీ తీసుకోరు. కానీ, 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించితే మాత్రం ప‌న్నులు త‌ప్పవు. అయితే.. ఇక్క‌డ కూడా కొంత ఊర‌ట ఉంది. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించి ఆదాయం పొందుతున్న వారికి కూడా.. తొలి 4 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఎలాంటి ఆదాయ ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అదేవిధంగా 4 ల‌క్ష‌ల త‌ర్వాత‌.. మ‌రో 75 వేల వ‌ర‌కు.. ఎల్ ఐసీలు, పొదుపు ఖాతాల‌ను చూపించుకోవ‌చ్చు. అంటే.. మొత్తంగా 4.75 ల‌క్షల వ‌ర‌కు ఎలాంటి ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

కానీ, ఆ త‌ర్వాత మాత్రం శ్లాబుల వారీగా లెక్కించి ప‌న్నులు వ‌సూలు చేస్తారు.

  • 4.75 ల‌క్ష‌ల నుంచి – 8 ల‌క్ష‌ల వ‌ర‌కు 5 శాతం(16,250 ప‌న్ను చెల్లించాలి)
  • 8-12 ల‌క్ష‌ల వ‌ర‌కు 10 శాతం
  • 12-16 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం
  • 16-20 ల‌క్ష‌ల వ‌ర‌కు 20 శాతం
  • 20-24 ల‌క్ష‌ల వ‌ర‌కు 25 శాతం
  • 24 ల‌క్ష‌ల నుంచి ఎంత ఆదాయం ఉన్నా.. 30 శాతం ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది.

This post was last modified on February 1, 2025 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

41 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago