Political News

అప్పుల‌ బాట‌లోనే కేంద్రం.. ఈ ఏడాది 11 ల‌క్ష‌ల కోట్లు!

రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్ర‌బుత్వం కూడా అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌లో 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ, వ్య‌యాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. మొత్తం బ‌డ్జెట్‌.. స‌మ‌గ్ర స్వ‌రూపాన్ని చూస్తే.. అప్పులు చేయ‌క‌త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వ‌చ్చాయి. అస‌లు ఈ విష‌యాన్ని మంత్రే చెప్పుకొచ్చారు. 2025-26 వార్షిక బ‌డ్జెట్లో చెప్పిన లెక్క‌లు చూస్తే.. ద్ర‌వ్య లోటు.. జీడీపీలో 4.4 శాతంగా ఉంది. అంటే.. చేసే ఖ‌ర్చుకు, వ‌చ్చే ఆదాయానికి మ‌ధ్య దాదాపు 24% తేడా ఉంది.

దీంతో మొత్తం బ‌డ్జెట్లో 24 శాతం మేర‌కు వివిధ మార్గాలు(అంటే అప్పులు) ద్వారా స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది బ‌డ్జెట్‌లో పేర్కొన్న మేర‌కు 11.4 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఈ మొత్తాన్ని మోడీ స‌ర్కారు పూర్తిగా అప్పులు రూపంలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక‌, బ‌డ్జెట్ మొత్తం అంచ‌నా 50.65 ల‌క్ష‌ల కోట్లు గా పేర్కొన్నారు. దీనిలో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప‌న్నులు, క‌స్ట‌మ్ డ్యూటీల ద్వారా 34.96 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. మిగిలిన దానిలోనూ కొంత మేర‌కు ఇత‌ర రూపాల్లో స‌మీకరించుకుంటున్నా.. 11.4 ల‌క్ష‌ల కోట్లు మాత్రం ఖ‌చ్చితంగా అప్పులు చేయాల్సి రావాల్సిందే.

ఇక‌, గ‌త ఏడాది 2024-25లో మొత్తం రాబడి రూ.31.47 లక్షల కోట్లుగా ఉంటే.. మొత్తం ఖర్చు రూ.47.16 లక్షల కోట్లు.. 2024-25లో ఫిస్కల్‌ డెఫిసిట్ జీడీపీలో 4.8 శాతంగా ఉంద‌ని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక‌, ఇప్పుడు 2025-26లో మొత్తం ఖర్చు అంచనా రూ.50.65 లక్షల కోట్లుగా పేర్కొన‌గా.. 2025-26లో మొత్తం రాబడి అంచనా రూ.34.96 లక్షల కోట్లుగా ఉంది. లోటు జీడీపీలో 4.4 శాతం. అంటే.. ఇది గ‌త ఏడాదికంటే త‌క్కువ చూపించారు. కానీ, అప్పు చేయాల్సిన మొత్తం రూ.11.4 లక్షల కోట్లుగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది.

This post was last modified on February 1, 2025 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

34 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago