Political News

వేతన జీవులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్

అంతా అనుకున్నట్లుగా మధ్య తరగతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ను నిర్మల ప్రశేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు భారీ కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి… మధ్య తరగతికి భారీ ఊరట ఇచ్చేలా సంచలన ప్రకటన చేశారు. ఏ వర్గం వారికైనా రూ.4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని విధంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ఇక నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన వేతన జీవులకు కూడా ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను విధించట్లేదని తెలిపారు. దీనికి అదనంగా లభించే స్టాండర్డ్ డిడక్షన్ ను కలుపుకుంటే.. రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెగనుంది. అంటే… మొత్తంగా వేతన జీవులకు రూ.12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభించనుందన్న మాట. వాస్తవానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచుతారని అంతా భావించారు. అయితే ఆ అంచనాకు మించి రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపును నిర్మలమ్మ ప్రకటించారు.

రూ.12 లక్సల వార్షిక ఆదాయాన్ని మించిన వేతన జీవులకు వారి ఆదాయం ఆదారంగా పలు రకాలుగా పన్ను శ్లాబులను నిర్మలమ్మ ప్రతిపాదించారు. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శతం పన్ను విధిస్తారు. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆదాయం ఉన్న వారిపై 20 శాతం పన్ను విధిస్తారు. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాాతం పన్నును విధిస్తారు. రూ.24 లక్షలకు మించిన వార్షిక ఆదాయంపై 30 శాతం పన్నును విధిస్తారు.

వేతన జీవులకు భారీ ఊరట ఇచ్చిన నిర్మలమ్మ… ఇతర వర్గాలపైనా వరాలు కురిపించారు. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.50 వేల పరిమితిని రూ.1 లక్షకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక అద్దె ద్వారా సీనియర్ సిటిజన్స్ పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.2.4 లక్షల పరిమితిని ఏకంగా రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు వృద్ధులకు ఎంతో ప్రయోజనం లభించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర అంశాలు ఎలా ఉన్నా… వేతన జీవుల పన్నులు, టీడీఎస్, రెంట్ తదితర అంశాలపై నిర్మలమ్మ చేసిన ప్రకటనలపై హర్షం వ్యక్తమవుతోంది.

This post was last modified on February 1, 2025 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరణించే హక్కు.. అక్కడ అఫీషియల్!

కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ, లైఫ్ సపోర్ట్‌పై ఆధారపడే రోగులకు గౌరవంగా మరణించే అవకాశం కల్పించేలా కర్ణాటక ప్రభుత్వం కీలక…

1 hour ago

రేవంత్ కు షాకా?…ప్రీ ప్లానేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం…

2 hours ago

హర్షిత్ రాణా సబ్‌స్టిట్యూట్ : రూల్స్ కి విరుద్ధమా?

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తూ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టీమిండియా విజయంలో…

2 hours ago

బాబుకు ఢిల్లీ లో తెలుగు వారే టార్గెట్

మాట‌ల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్క‌డున్నా వారిని త‌న‌వైపు తిప్పుకోగ‌ల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం…

3 hours ago

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…

4 hours ago

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…

4 hours ago