Political News

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు పేరిట ఏటా నిర్వహిస్తున్న వేడుకలను ఈ ఏడాది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్విహించాలని తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగ్గా… ఏటా నిర్వహిస్తున్న మహానాడుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ దఫా కడపలో మహానాడును నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో టీడీపీకీ ఓ మోస్తరు బలం కనిపించినా… జగన్ హయాంలో ఆ జిల్లా నుంచి టీడీపీని తరిమివేసే దిశగా వైసీపీ అడుగులు వేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మిగిలిన అన్ని ప్రాంతాలతో పాటుగా కడప జిల్లాలోనూ టీడీపీ సత్తా చాటింది. ఏళ్ల తరబడి వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టే అభ్యర్థులే విజయం సాదిస్తూ వస్తున్న కడప అసెంబ్లీని కూడా ఈ దఫా టీడీపీ లాగేసుకుంది. పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగానే కడపలో మహానాడును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదలా ఉంటే…మహానాడు లోగా పార్టీలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా పొలిట్ బ్యూరో తీర్మానించింది. అంతేకాకుండా మహానాడులో పార్టీకి జాతీయ, రాష్ట్ర నూతన కమిటీలను ఎన్నుకోవాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రంలో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదని అభిప్రాయపడింది. ఇప్పటికైనా జిల్లాల విభజనలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దాలని సూచించింది. దాదాపుగా 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. మహానాడు వేదికగానే ఈ ఘట్టాన్ని పూర్తి చేయాలని కూడా మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.

This post was last modified on February 1, 2025 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

6 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

17 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

1 hour ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago