ఒకవైపు వైసీపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని.. ఇక, చేయదని .. చంద్రబాబు పేదలకు వ్యతిరేకమని వార్తలు, వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో మరింతగా వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. దీంతో సర్కారు ఎంత చేస్తున్నా.. ప్రజల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తేనో.. లేక కార్యక్రమాన్ని చేపడితేనో.. ఆ ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రజల మధ్య చర్చవస్తోంది.
కానీ, ఆ తర్వాత కూడా.. ప్రజలను కలుసుకుని సదరు పథకాలపై వారికి మరింత లోతుగా వివరించాలన్నది సీఎంగా చంద్రబాబు పార్టీ నాయకులకు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న కృషిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని ఆయన పరోక్షంగా ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది కాలు కదపరు – వాయిస్ పెంచరు. కానీ, రాజకీయాల్లో మాత్రం తమకు పదవులు కావాలని పోరుపెడుతున్నారు.
ఈ వ్యవహారమే చంద్రబాబుకు మంట పుట్టిస్తోంది. అనేక రూపాల్లో ఆయన నాయకులను ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా హెచ్చరిస్తున్నారు. పనిచేసే వారికే పదవులని కూడా చెబుతున్నారు. ఎంత సీనియర్ అయినా.. ప్రజల మధ్యకువెళ్లాలని చెబుతున్నారు. ఇక, నారా లోకేష్ అయితే.. యువతకు ప్రాధాన్యం ఇస్తామంటూ.. పరోక్షంగా సీనియర్లపై ఆయన గుర్రుగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ, ఇంత జరుగుతున్నా.. సీనియర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఇక, జూనియర్ల సంగతి వేరేగా ఉంది. వారు వివాదాలకు సై అంటున్నారు. దీంతో పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ.. ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలు కానీ.. ఏదో నామ్కే వాస్తే.. అన్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇది అనుకున్న విధంగా అయితే.. చంద్రబాబుకు మైలేజీ రావడం లేదన్నది అంతర్గతంగా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లను వదిలించుకోవడమా.. లేక, వారిని పిలిచి క్లాస్ తీసుకోవడమా? అనే విషయంపై చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 31, 2025 7:13 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…