Political News

ఈ మాజీ మంత్రి ఎక్కడా కనబడటం లేదట

ఓడలు బండ్లు..బండ్లు ఓడలవుతాయనే సామెత ఇటువంటి వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది. సంవత్సరాల తరబడి ఎవరికీ తెలీకుండా తెర వెనుక మాత్రమే ఉన్న వ్యక్తి ఒక్క సారిగా 2014 ఎన్నికల తర్వాత తెరముందుకు వచ్చేశారు. అంతే కాకుండా ఐదేళ్ళపాటు ఓ వెలుగు వెలిగారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. నారాయణ ఎప్పుడూ ప్రజా జీవితంలో లేనేలేరు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీని ఆదుకున్నాడన్న కారణంగా చంద్రబాబునాయుడు ఈయనకు మంత్రిపదవిని ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నారాయణ ఎంఎల్సీ అయి తర్వాత మంత్రయిపోయారు.

అందులోను కీలకమైన రాజధాని అమరావతి, సిఆర్డీఏ కూడా ఆయన చేతిలోనే ఉండేది. మున్సిపల్ శాఖ మంత్రిగా వెలుగు వెలిగారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎంఎల్ఏలు, మంత్రులు, నేతలే అసూయపడే స్ధాయిలో నారాయణ స్థానం సంపాదించారు. ఇటువంటి నారాయణతో స్వయంగా తాను ఎన్నికల్లో ఓడిపోవటంతో పాటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయేసరికి ఎక్కడా అడ్రస్ కనబడటం లేదట. పార్టీతో పాటు చంద్రబాబుకు కూడా బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.

ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయారో అప్పటి నుండి కేవలం తన విద్యాసంస్ధలకే పరిమితమైపోయారని టాక్. వ్యాపారాలు కీలకం కావడం వల్ల ఆర్ధిక పునాదులకు దెబ్బ తగులుతుందన్న టెన్షన్ బాగా ఎక్కువైపోవడం దీనికి కారణం కావచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కారణంతో విజయవాడ, తిరుపతి, ఏలూరులో కొన్ని విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేసింది. ఈ నేపధ్యంలోనే తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోవటమే ఉత్తమం అనే పద్దతిలో నారాయణ వ్యవహరిస్తున్నారట.

నెల్లూరులో కానీ విజయవాడ, హైదరాబాద్ లో ఎక్కడా సాధ్యమైనంతలో టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఏదన్నా అవసరమై నెల్లూరుకు వచ్చినా ఎవరినీ కలవకుండానే వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతున్నారట. మాజీ మంత్రి పరిస్దితే ఇలాగుంటే ఆయన్ను నమ్ముకుని రాజకీయాల్లో ఐదేళ్ళు ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన మద్దతుదారుల మాటేమిటి ? అనేది జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది.

ఆ మధ్యలో నారాయణ వైసీపీలో చేరిపోతున్నారంటూ ప్రచారం జరిగినా ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ఎందుకైనా మంచిదని నారాయణతో పాటు ఆయన వర్గమంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. నారాయణ పరిస్ధితి ఇలాగుంటే ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, విశాఖనగరంలో ప్రస్తుత ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పరిస్ధితి… రాజధాని వివాదం వల్ల మరో రకరమైన డోలయామానంలో ఉంది.

This post was last modified on October 21, 2020 9:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago