ఓడలు బండ్లు..బండ్లు ఓడలవుతాయనే సామెత ఇటువంటి వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది. సంవత్సరాల తరబడి ఎవరికీ తెలీకుండా తెర వెనుక మాత్రమే ఉన్న వ్యక్తి ఒక్క సారిగా 2014 ఎన్నికల తర్వాత తెరముందుకు వచ్చేశారు. అంతే కాకుండా ఐదేళ్ళపాటు ఓ వెలుగు వెలిగారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. నారాయణ ఎప్పుడూ ప్రజా జీవితంలో లేనేలేరు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీని ఆదుకున్నాడన్న కారణంగా చంద్రబాబునాయుడు ఈయనకు మంత్రిపదవిని ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నారాయణ ఎంఎల్సీ అయి తర్వాత మంత్రయిపోయారు.
అందులోను కీలకమైన రాజధాని అమరావతి, సిఆర్డీఏ కూడా ఆయన చేతిలోనే ఉండేది. మున్సిపల్ శాఖ మంత్రిగా వెలుగు వెలిగారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎంఎల్ఏలు, మంత్రులు, నేతలే అసూయపడే స్ధాయిలో నారాయణ స్థానం సంపాదించారు. ఇటువంటి నారాయణతో స్వయంగా తాను ఎన్నికల్లో ఓడిపోవటంతో పాటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయేసరికి ఎక్కడా అడ్రస్ కనబడటం లేదట. పార్టీతో పాటు చంద్రబాబుకు కూడా బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయారో అప్పటి నుండి కేవలం తన విద్యాసంస్ధలకే పరిమితమైపోయారని టాక్. వ్యాపారాలు కీలకం కావడం వల్ల ఆర్ధిక పునాదులకు దెబ్బ తగులుతుందన్న టెన్షన్ బాగా ఎక్కువైపోవడం దీనికి కారణం కావచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కారణంతో విజయవాడ, తిరుపతి, ఏలూరులో కొన్ని విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేసింది. ఈ నేపధ్యంలోనే తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోవటమే ఉత్తమం అనే పద్దతిలో నారాయణ వ్యవహరిస్తున్నారట.
నెల్లూరులో కానీ విజయవాడ, హైదరాబాద్ లో ఎక్కడా సాధ్యమైనంతలో టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఏదన్నా అవసరమై నెల్లూరుకు వచ్చినా ఎవరినీ కలవకుండానే వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతున్నారట. మాజీ మంత్రి పరిస్దితే ఇలాగుంటే ఆయన్ను నమ్ముకుని రాజకీయాల్లో ఐదేళ్ళు ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన మద్దతుదారుల మాటేమిటి ? అనేది జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది.
ఆ మధ్యలో నారాయణ వైసీపీలో చేరిపోతున్నారంటూ ప్రచారం జరిగినా ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ఎందుకైనా మంచిదని నారాయణతో పాటు ఆయన వర్గమంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. నారాయణ పరిస్ధితి ఇలాగుంటే ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, విశాఖనగరంలో ప్రస్తుత ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పరిస్ధితి… రాజధాని వివాదం వల్ల మరో రకరమైన డోలయామానంలో ఉంది.
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…