వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించారు. గురువారం రాత్రి లండన్ లో ఫ్లైట్ ఎక్కిన జగన్ దంపతులు… శుక్రవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. దాదాపుగా 15 రోజులకు పైగా లండన్ లో సేదదీరిన జగన్… నిర్దేశిత గడువులోగానే తన పర్యటనను ముగించారు. ప్రస్తుతం బెంగళూరు చేరిన జగన్… విదేశీ ప్రయాణం బడలికను తీర్చుకుని ఫిబ్రవరి 3న నింపాదిగా తాడేపల్లి చేరుకుంటారట.
లండన్ లో చదువుతున్న తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లిన జగన్.. లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేశారు. ప్రారంభంలో అంతగా ఫోకస్ లేకుండానే లండన్ వీధుల్లో సంచరించిన జగన్…ఆ తర్వాత తన ఫొటోలు సోషల్ మీడియాలోకి ఎక్కేలా నడుచుకున్నారు. రోజుకో కొత్త లుక్కులో కనిపించిన జగన్… ఫ్యాషన్ దుస్తులపై తనకు ఎంతగా ఇష్టముందన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. లండన్ లో ఉండగా…తన రెగ్యులర్ డ్రెస్ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు.
అదేంటో గానీ…జగన్ తో పాటు జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విదేశాలకు వెళితే.. తమ రెగ్యులర్ డ్రెస్సింగ్ ను పక్కనపెట్టేస్తారు. ఎంచక్కా తమకు ఇష్టమైన సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లోకి ఒరిగిపోయి తమలో దాగి ఉన్న ఫ్యాషన్ దాహార్తి తీర్చుకుంటారు. అయితే విదేశీ పర్యటనలు ముగించుకుని దేశానికి తిరిగి వచ్చారంటే… క్షణం ఆలస్యం చేయకుండా వారు తిరిగి తమ రెగ్యులర్ యూనిఫాంలలోకి మారిపోతారు.
ఇప్పుడు జగన్ కూడా అదే మాదిరిగా లండన్ వీడి బెంగళూరు చేరినంతనే తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ అయిన తెలుపు చొక్కా, ఖాకీ ప్యాంటులోకి మారిపోయారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. గురువారం రాత్రి లండన్ లో విమానం ఎక్కే సందర్భంగా జగన్ జీన్స్, బ్లేజర్ లో సందడి చేశారు. తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో ఫొటోలు తీసుకున్నారు. అయితే బెంగళూరులో నేటి ఉదయం విమానం దిగిన ఆయన తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ లో బయటకు వచ్చారు.
This post was last modified on January 31, 2025 12:23 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…