వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించారు. గురువారం రాత్రి లండన్ లో ఫ్లైట్ ఎక్కిన జగన్ దంపతులు… శుక్రవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. దాదాపుగా 15 రోజులకు పైగా లండన్ లో సేదదీరిన జగన్… నిర్దేశిత గడువులోగానే తన పర్యటనను ముగించారు. ప్రస్తుతం బెంగళూరు చేరిన జగన్… విదేశీ ప్రయాణం బడలికను తీర్చుకుని ఫిబ్రవరి 3న నింపాదిగా తాడేపల్లి చేరుకుంటారట.
లండన్ లో చదువుతున్న తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లిన జగన్.. లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేశారు. ప్రారంభంలో అంతగా ఫోకస్ లేకుండానే లండన్ వీధుల్లో సంచరించిన జగన్…ఆ తర్వాత తన ఫొటోలు సోషల్ మీడియాలోకి ఎక్కేలా నడుచుకున్నారు. రోజుకో కొత్త లుక్కులో కనిపించిన జగన్… ఫ్యాషన్ దుస్తులపై తనకు ఎంతగా ఇష్టముందన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. లండన్ లో ఉండగా…తన రెగ్యులర్ డ్రెస్ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు.
అదేంటో గానీ…జగన్ తో పాటు జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విదేశాలకు వెళితే.. తమ రెగ్యులర్ డ్రెస్సింగ్ ను పక్కనపెట్టేస్తారు. ఎంచక్కా తమకు ఇష్టమైన సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లోకి ఒరిగిపోయి తమలో దాగి ఉన్న ఫ్యాషన్ దాహార్తి తీర్చుకుంటారు. అయితే విదేశీ పర్యటనలు ముగించుకుని దేశానికి తిరిగి వచ్చారంటే… క్షణం ఆలస్యం చేయకుండా వారు తిరిగి తమ రెగ్యులర్ యూనిఫాంలలోకి మారిపోతారు.
ఇప్పుడు జగన్ కూడా అదే మాదిరిగా లండన్ వీడి బెంగళూరు చేరినంతనే తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ అయిన తెలుపు చొక్కా, ఖాకీ ప్యాంటులోకి మారిపోయారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. గురువారం రాత్రి లండన్ లో విమానం ఎక్కే సందర్భంగా జగన్ జీన్స్, బ్లేజర్ లో సందడి చేశారు. తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో ఫొటోలు తీసుకున్నారు. అయితే బెంగళూరులో నేటి ఉదయం విమానం దిగిన ఆయన తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ లో బయటకు వచ్చారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…