తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోమారు తెర మీదకు వచ్చి ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాలకు ముందు చాలాకాలం పాటు సినిమాల్లో నటించిన జయలలిత భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చకున్న జయ..సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేకు ముచ్చెమటలు పట్టించారు. తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ జయ తనదైన ముద్ర వేశారని చెప్పక తప్పదు.
సరే… అదంతా గతమైతే సీఎం కుర్చీలో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన జయ చాలా రోజుల పాటు ఆసుపత్రి బెడ్ పైనే ఉండి చివరకు ప్రాణాలు వదిలారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బాగానే సంపాదించిన జయ… చనిపోయే నాటికి ఏకంగా రూ.913 కోట్లను పోగేశారని తమిళనాడు సర్కారు తేల్చింది. అయితే చనిపోయేదాకా అవివాహితురాలిగానే ఉండిపోయిన జయకు వారసులు లేని కారణంగా ఆమె ఆస్తులను ప్రభుత్వం కర్ణాటక స్పెషల్ కోర్టు రక్షణలో ఉంచింది. జయకు తామేవారసులమంటూ తెర మీదకు వచ్చిన దీప గానీ, దీపక్ గానీ ఆమె వారసులు కానే కాదని కోర్టు ఇదివరకే తీర్పుచెప్పింది.
తాజాగా వారసులు ఎవరూ లేని కారణంగా జయ ఆస్తులను తమిళనాడు సర్కారుకు అప్పగించేందుకు కర్ణాటక స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జయ ఆస్తులను త్వరలోనే తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. సీజ్ చేసిన నాడు రూ.913 కోట్ల విలువ ఉన్న సదరు ఆస్తుల విలువ ఇప్పుడు ఏకంగా రూ.4 వేల కోట్ల పైమాటేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే… తమిళనాడు సర్కారీ ఖజానాకు జయ రూ.4 వేల కోట్ల ఆస్లులు సంపాదించి వెల్లిపోయారన్న మాట.
వందల కోట్ల విలువ కలిగిన ఆస్తుల విలువ పదేళ్లలోనే ఇలా వేల కోట్లకు ఎలా చేరిందని అందరికీ అనుమానం రావచ్చు. అందుకే,… ఆమె ఆస్తుల్లో ఏమేం ఉన్నాయో తెలుసుకుంటే… ఆ అనుమానాలు పటాపంచలు కావడం తథ్యమేనని చెప్పాలి. జయ ఆస్తుల్లో మెజారిటీ భాగం భూములే. జయ పేరిట ఏకంగా 1,562 ఎకరాల భూములున్నాయి. 27 కిలో బంగారాన్ని ఆమె కొనుగోలు చేశారు. 10 వేల చీరలతో పాటు 750 జతల ఖరీదైన పాదరక్షలు ఉన్నాయి. ఇక అత్యంత ఖరీదైన ఇంపోర్టెట్ గడియారాలు కూడా ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి.
This post was last modified on January 31, 2025 10:29 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…