తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోమారు తెర మీదకు వచ్చి ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాలకు ముందు చాలాకాలం పాటు సినిమాల్లో నటించిన జయలలిత భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చకున్న జయ..సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేకు ముచ్చెమటలు పట్టించారు. తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ జయ తనదైన ముద్ర వేశారని చెప్పక తప్పదు.
సరే… అదంతా గతమైతే సీఎం కుర్చీలో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన జయ చాలా రోజుల పాటు ఆసుపత్రి బెడ్ పైనే ఉండి చివరకు ప్రాణాలు వదిలారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బాగానే సంపాదించిన జయ… చనిపోయే నాటికి ఏకంగా రూ.913 కోట్లను పోగేశారని తమిళనాడు సర్కారు తేల్చింది. అయితే చనిపోయేదాకా అవివాహితురాలిగానే ఉండిపోయిన జయకు వారసులు లేని కారణంగా ఆమె ఆస్తులను ప్రభుత్వం కర్ణాటక స్పెషల్ కోర్టు రక్షణలో ఉంచింది. జయకు తామేవారసులమంటూ తెర మీదకు వచ్చిన దీప గానీ, దీపక్ గానీ ఆమె వారసులు కానే కాదని కోర్టు ఇదివరకే తీర్పుచెప్పింది.
తాజాగా వారసులు ఎవరూ లేని కారణంగా జయ ఆస్తులను తమిళనాడు సర్కారుకు అప్పగించేందుకు కర్ణాటక స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జయ ఆస్తులను త్వరలోనే తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. సీజ్ చేసిన నాడు రూ.913 కోట్ల విలువ ఉన్న సదరు ఆస్తుల విలువ ఇప్పుడు ఏకంగా రూ.4 వేల కోట్ల పైమాటేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే… తమిళనాడు సర్కారీ ఖజానాకు జయ రూ.4 వేల కోట్ల ఆస్లులు సంపాదించి వెల్లిపోయారన్న మాట.
వందల కోట్ల విలువ కలిగిన ఆస్తుల విలువ పదేళ్లలోనే ఇలా వేల కోట్లకు ఎలా చేరిందని అందరికీ అనుమానం రావచ్చు. అందుకే,… ఆమె ఆస్తుల్లో ఏమేం ఉన్నాయో తెలుసుకుంటే… ఆ అనుమానాలు పటాపంచలు కావడం తథ్యమేనని చెప్పాలి. జయ ఆస్తుల్లో మెజారిటీ భాగం భూములే. జయ పేరిట ఏకంగా 1,562 ఎకరాల భూములున్నాయి. 27 కిలో బంగారాన్ని ఆమె కొనుగోలు చేశారు. 10 వేల చీరలతో పాటు 750 జతల ఖరీదైన పాదరక్షలు ఉన్నాయి. ఇక అత్యంత ఖరీదైన ఇంపోర్టెట్ గడియారాలు కూడా ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…