వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకరు. పైకి సౌమ్యుడిలా కనిపిస్తారు కానీ.. చిత్తూరు జిల్లాలో ఆయన అరాచకాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. అధికారంలో ఉండగా పెద్దిరెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ వాటినేమీ పట్టించుకోకుండా.. ఏం చేయాలనుకుంటే అది చేసుకుపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మీడియా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే అడవిని ఆక్రమించి కట్టిన భారీ ఫామ్ హౌస్, దానికి కిలోమీటర్ల కొద్దీ వేయించుకున్న రోడ్డుకు సంబంధించిన భాగోతం అంతా బయటికి వచ్చింది. అటవీ శాఖా మంత్రి అయిన పవన్ కళ్యాణ్.. పెద్ది రెడ్డి అవినీతి వ్యవహారాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని.. ఫామ్ హౌస్ వ్యవహారంలో ఆయన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సహా పవన్ కళ్యాణ్ తన మీద చాలా ఆరోపణలు చేశారని, కానీ ఇప్పటిదాకా ఏం చర్యలు చేపట్టలేకపోయారని విమర్శించిన పెద్దిరెడ్డి.. ఫాం హౌస్ విషయంలో ఇచ్చిన వివరణ హైలైట్ అనే చెప్పాలి.
తమ భూముల్లో పని చేసే మనుషులు చాలామంది ఉన్నారని.. వాళ్లందరూ నివాసం ఉండడం కోసమే అటీవీ ప్రాంతంలో ఆ ఇల్లు కట్టించానని.. రోడ్డు కూడా వేయించానని.. చుట్టు పక్కల చెట్లు కూడా పెట్టించానని చెప్పారు పెద్దిరెడ్డి. ఐతే ఆ ఫాం హౌస్ వ్యవహారం చూస్తే మామూలుగా లేదు. అదో లగ్జరీ హౌస్ అని బయటి నుంచి చూస్తేనే స్పష్టంగా తెలుస్తోంది. పని వాళ్ల కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టించి.. ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేయించడమంటే పెద్దిరెడ్డిది చాలా పెద్ద మనసని.. ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తారా అని వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on January 31, 2025 9:06 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…