Political News

వరద ఆగట్లేదు!… ఏపీకి మరో 15 ప్రాజెక్టులు!

నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

పెట్టుబడులు వస్తున్న వేగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరుగు పెట్టాల్సిందే కదా. అందుకే కాబోలు… ఈ 7 నెలల్లోనే ఇప్పటికే రెండు పర్యాయాలు బేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గురువారం మూడో సారి కూడా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కూడా మరో 15 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీలో ఆమోదం లభించిన 15 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో 19,580 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటుటోకి రానున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ…ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫలితంగా ఆయా కంపెనీల యూనిట్లు రాష్ట్రంలో త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ విషయంలో కంపెనీల పట్ల పక్షపాతం సహించేది లేదని హెచ్చరించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడును కొనసాగిస్తే… అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించనంత మేర వృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.

This post was last modified on January 30, 2025 6:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

39 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago