నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
పెట్టుబడులు వస్తున్న వేగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరుగు పెట్టాల్సిందే కదా. అందుకే కాబోలు… ఈ 7 నెలల్లోనే ఇప్పటికే రెండు పర్యాయాలు బేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గురువారం మూడో సారి కూడా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కూడా మరో 15 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీలో ఆమోదం లభించిన 15 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో 19,580 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటుటోకి రానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ…ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫలితంగా ఆయా కంపెనీల యూనిట్లు రాష్ట్రంలో త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ విషయంలో కంపెనీల పట్ల పక్షపాతం సహించేది లేదని హెచ్చరించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడును కొనసాగిస్తే… అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించనంత మేర వృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…