నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
పెట్టుబడులు వస్తున్న వేగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరుగు పెట్టాల్సిందే కదా. అందుకే కాబోలు… ఈ 7 నెలల్లోనే ఇప్పటికే రెండు పర్యాయాలు బేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గురువారం మూడో సారి కూడా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కూడా మరో 15 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీలో ఆమోదం లభించిన 15 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో 19,580 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటుటోకి రానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ…ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫలితంగా ఆయా కంపెనీల యూనిట్లు రాష్ట్రంలో త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ విషయంలో కంపెనీల పట్ల పక్షపాతం సహించేది లేదని హెచ్చరించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడును కొనసాగిస్తే… అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించనంత మేర వృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.
This post was last modified on January 30, 2025 6:59 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…