Political News

గురువు బాటలో రేవంత్ ‘ఏఐ’ అడుగులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని తిరిగి రాగానే… ఏఐ వినియోగంపై ఆయన ఒకింత లోతుగానే దృష్టి పెట్టినట్టు ఉన్నారు. అందుకే కాబోలు తెలంగాణ సర్కారు నుంచి గురువారం ఏఐ వినియోగం దిశగా ఓ కీలక ప్రకటన వెలువడింది.

తెలంగాణలోని పాఠశాల విద్యలో ఏఐని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్టుగా కూడా కీలక ప్రకటన చేసింది.ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా సదరు ప్రకటన వెల్లడించింది. అందుకోసం అవసరమైన చర్యలను ప్రారంబించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.

దావోస్ నుంచి తిరిగి వచ్చినంతనే… అక్కడ తనకు ఎదురైన అనుభవాలను అధికారులు, సహచర మంత్రులతో పంచుకున్న రేవంత్ రెడ్డి… భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారట. అందివస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగితేనే రేసులో ఉంటామన్న విషయాన్ని ఆయన చెప్పారట. ఈ క్రమంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టే రంగాలను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మరోమారు సీఎంతో భేటీ అయి పాఠశాల విద్యలో ఏఐ వినియోగంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. వారి ప్రజెంటేషన్ విన్న రేవంత్ ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సీఎం ఓకే చెప్పినంతనే బెంగళూరు వెళ్లిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అక్కడ ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారట.

This post was last modified on January 30, 2025 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago