Political News

గురువు బాటలో రేవంత్ ‘ఏఐ’ అడుగులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని తిరిగి రాగానే… ఏఐ వినియోగంపై ఆయన ఒకింత లోతుగానే దృష్టి పెట్టినట్టు ఉన్నారు. అందుకే కాబోలు తెలంగాణ సర్కారు నుంచి గురువారం ఏఐ వినియోగం దిశగా ఓ కీలక ప్రకటన వెలువడింది.

తెలంగాణలోని పాఠశాల విద్యలో ఏఐని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్టుగా కూడా కీలక ప్రకటన చేసింది.ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా సదరు ప్రకటన వెల్లడించింది. అందుకోసం అవసరమైన చర్యలను ప్రారంబించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.

దావోస్ నుంచి తిరిగి వచ్చినంతనే… అక్కడ తనకు ఎదురైన అనుభవాలను అధికారులు, సహచర మంత్రులతో పంచుకున్న రేవంత్ రెడ్డి… భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారట. అందివస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగితేనే రేసులో ఉంటామన్న విషయాన్ని ఆయన చెప్పారట. ఈ క్రమంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టే రంగాలను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మరోమారు సీఎంతో భేటీ అయి పాఠశాల విద్యలో ఏఐ వినియోగంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. వారి ప్రజెంటేషన్ విన్న రేవంత్ ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సీఎం ఓకే చెప్పినంతనే బెంగళూరు వెళ్లిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అక్కడ ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారట.

This post was last modified on January 30, 2025 6:35 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

58 minutes ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

3 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

5 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

8 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

11 hours ago