Political News

గురువు బాటలో రేవంత్ ‘ఏఐ’ అడుగులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని తిరిగి రాగానే… ఏఐ వినియోగంపై ఆయన ఒకింత లోతుగానే దృష్టి పెట్టినట్టు ఉన్నారు. అందుకే కాబోలు తెలంగాణ సర్కారు నుంచి గురువారం ఏఐ వినియోగం దిశగా ఓ కీలక ప్రకటన వెలువడింది.

తెలంగాణలోని పాఠశాల విద్యలో ఏఐని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్టుగా కూడా కీలక ప్రకటన చేసింది.ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా సదరు ప్రకటన వెల్లడించింది. అందుకోసం అవసరమైన చర్యలను ప్రారంబించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.

దావోస్ నుంచి తిరిగి వచ్చినంతనే… అక్కడ తనకు ఎదురైన అనుభవాలను అధికారులు, సహచర మంత్రులతో పంచుకున్న రేవంత్ రెడ్డి… భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారట. అందివస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగితేనే రేసులో ఉంటామన్న విషయాన్ని ఆయన చెప్పారట. ఈ క్రమంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టే రంగాలను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మరోమారు సీఎంతో భేటీ అయి పాఠశాల విద్యలో ఏఐ వినియోగంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. వారి ప్రజెంటేషన్ విన్న రేవంత్ ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సీఎం ఓకే చెప్పినంతనే బెంగళూరు వెళ్లిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అక్కడ ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారట.

This post was last modified on January 30, 2025 6:35 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

2 hours ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

4 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

7 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

8 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

9 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

9 hours ago