Political News

కూటమి ఘన విజయం!… ‘ఉక్కు’కు లేదిక ముప్పు!

ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి.ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన విజయం కంటే కూడా గురువారం నాటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి ప్రకటన కూటమికి అధిక సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి.

గురువారం ఏపీ పర్యటనకు వచ్చిన కుమారస్వామి… రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక ఎంపీ భరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి విశాఖ ఉక్కులోకి ప్రవేశించారు. అనంతరం అటు కార్మిక సంఘాలతో పాటుగా ఇటు కంపెనీ అధికారులతో ఆయన వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కంపెనీ పునరుజ్జీవం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపైనా చర్చలు జరిగాయి. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీల తర్వాత అక్కడే మీడియా ముందుకు వచ్చిన కుమారస్వామి కేంద్రం మాటను విస్పష్టంగా ప్రకటించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని ఈ సందర్బంగా కుమారస్వామి ప్రకటించారు. ప్రైవేటీకరణ మాటను పక్కనపెట్టడంతో పాటుగా కంపెనీకి పునరుజ్జీవం దక్కేలా చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖ ఉక్కు కోసం నాడు ఏపీ ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను ఆయన గుర్తు చేశారు. 2014 దాకా కంపెనీ మంచి లాభాల్లోనే సాగిందన్న మంత్రి… ఆ తర్వాత నవరత్న హోదా సాధించి ఉప్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలన్న నిర్ణయాలు కంపెనీని నష్టాల బాటలో పయనించేలా చేశాయని తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు రూ.35 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు.

అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరణ చేయాలన్న దిశగా కొంత మేర ఆలోచన చేసినా… ఏపీ ఎంపీలు పదే పదే విశాఖ ఉక్కు గురించి ప్రస్తావిస్తూ… ఏపీ ప్రజల మనోభావాలు దానితో ఎలా ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని వివరించారని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలి ప్యాకేజీ వచ్చిందన్నారు. అయితే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా విశాఖ ఉక్కుకు ప్రదాని మోదీ ఓ లక్ష్యాన్నినిర్దేశించారని ఆయన తెలిపారు. ఇక కార్మికుల సమస్యలను రానున్న 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

Satya

Recent Posts

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

17 minutes ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

37 minutes ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

54 minutes ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

2 hours ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

3 hours ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

4 hours ago