Political News

కూటమి ఘన విజయం!… ‘ఉక్కు’కు లేదిక ముప్పు!

ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి.ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన విజయం కంటే కూడా గురువారం నాటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి ప్రకటన కూటమికి అధిక సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి.

గురువారం ఏపీ పర్యటనకు వచ్చిన కుమారస్వామి… రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక ఎంపీ భరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి విశాఖ ఉక్కులోకి ప్రవేశించారు. అనంతరం అటు కార్మిక సంఘాలతో పాటుగా ఇటు కంపెనీ అధికారులతో ఆయన వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కంపెనీ పునరుజ్జీవం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపైనా చర్చలు జరిగాయి. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీల తర్వాత అక్కడే మీడియా ముందుకు వచ్చిన కుమారస్వామి కేంద్రం మాటను విస్పష్టంగా ప్రకటించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని ఈ సందర్బంగా కుమారస్వామి ప్రకటించారు. ప్రైవేటీకరణ మాటను పక్కనపెట్టడంతో పాటుగా కంపెనీకి పునరుజ్జీవం దక్కేలా చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖ ఉక్కు కోసం నాడు ఏపీ ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను ఆయన గుర్తు చేశారు. 2014 దాకా కంపెనీ మంచి లాభాల్లోనే సాగిందన్న మంత్రి… ఆ తర్వాత నవరత్న హోదా సాధించి ఉప్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలన్న నిర్ణయాలు కంపెనీని నష్టాల బాటలో పయనించేలా చేశాయని తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు రూ.35 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు.

అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరణ చేయాలన్న దిశగా కొంత మేర ఆలోచన చేసినా… ఏపీ ఎంపీలు పదే పదే విశాఖ ఉక్కు గురించి ప్రస్తావిస్తూ… ఏపీ ప్రజల మనోభావాలు దానితో ఎలా ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని వివరించారని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలి ప్యాకేజీ వచ్చిందన్నారు. అయితే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా విశాఖ ఉక్కుకు ప్రదాని మోదీ ఓ లక్ష్యాన్నినిర్దేశించారని ఆయన తెలిపారు. ఇక కార్మికుల సమస్యలను రానున్న 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 minute ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

34 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

42 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago