Political News

బాలయ్య ఇలాకాలో టీడీపీ జెండా రెపరెపలు పక్కా

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.

అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యట్రిక్ విజయం సాధించారు. దీంతో మునిసిపాలిటీలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు బాలయ్య శ్రీకారం చుట్టగా… వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీ వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను లాగేసిన బాలయ్య…మునిసిపాలిటీపై పట్టు సాధించే యత్నం చేశారు. తాను సొంతంగా గెలిచిన 8 మంది కౌన్సిలర్లకు… వైసీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది కౌన్సిలర్లను కలుపుకుని టీడీపీ తన బలాన్ని 20కి పెంచుకుంది. అంటే… ప్రస్తుతం మునిసిపాలిటీలో టీడీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్టే.

ఈ క్రమంలో హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించాలన్న డిమాండ్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎన్నిక జరగనుంది. దీంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ముందుగానే జాగ్రత్త పడుతోంది. తన ఖాతాలో ఉన్న 20 మంది కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా తన కౌన్సిలర్లను సమీపంలోని పెనుకొండ రిసార్టుకు తరలించింది. చైర్మన్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి 3న వారిని నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తీసుకువచ్చేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీంతో హిందూపురం మునిసిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.

This post was last modified on January 30, 2025 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago