ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యట్రిక్ విజయం సాధించారు. దీంతో మునిసిపాలిటీలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు బాలయ్య శ్రీకారం చుట్టగా… వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీ వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను లాగేసిన బాలయ్య…మునిసిపాలిటీపై పట్టు సాధించే యత్నం చేశారు. తాను సొంతంగా గెలిచిన 8 మంది కౌన్సిలర్లకు… వైసీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది కౌన్సిలర్లను కలుపుకుని టీడీపీ తన బలాన్ని 20కి పెంచుకుంది. అంటే… ప్రస్తుతం మునిసిపాలిటీలో టీడీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్టే.
ఈ క్రమంలో హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించాలన్న డిమాండ్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎన్నిక జరగనుంది. దీంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ముందుగానే జాగ్రత్త పడుతోంది. తన ఖాతాలో ఉన్న 20 మంది కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా తన కౌన్సిలర్లను సమీపంలోని పెనుకొండ రిసార్టుకు తరలించింది. చైర్మన్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి 3న వారిని నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తీసుకువచ్చేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీంతో హిందూపురం మునిసిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…