ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యట్రిక్ విజయం సాధించారు. దీంతో మునిసిపాలిటీలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు బాలయ్య శ్రీకారం చుట్టగా… వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీ వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను లాగేసిన బాలయ్య…మునిసిపాలిటీపై పట్టు సాధించే యత్నం చేశారు. తాను సొంతంగా గెలిచిన 8 మంది కౌన్సిలర్లకు… వైసీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది కౌన్సిలర్లను కలుపుకుని టీడీపీ తన బలాన్ని 20కి పెంచుకుంది. అంటే… ప్రస్తుతం మునిసిపాలిటీలో టీడీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్టే.
ఈ క్రమంలో హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించాలన్న డిమాండ్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎన్నిక జరగనుంది. దీంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ముందుగానే జాగ్రత్త పడుతోంది. తన ఖాతాలో ఉన్న 20 మంది కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా తన కౌన్సిలర్లను సమీపంలోని పెనుకొండ రిసార్టుకు తరలించింది. చైర్మన్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి 3న వారిని నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తీసుకువచ్చేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీంతో హిందూపురం మునిసిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2025 3:49 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…