ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యట్రిక్ విజయం సాధించారు. దీంతో మునిసిపాలిటీలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు బాలయ్య శ్రీకారం చుట్టగా… వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీ వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను లాగేసిన బాలయ్య…మునిసిపాలిటీపై పట్టు సాధించే యత్నం చేశారు. తాను సొంతంగా గెలిచిన 8 మంది కౌన్సిలర్లకు… వైసీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది కౌన్సిలర్లను కలుపుకుని టీడీపీ తన బలాన్ని 20కి పెంచుకుంది. అంటే… ప్రస్తుతం మునిసిపాలిటీలో టీడీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్టే.
ఈ క్రమంలో హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించాలన్న డిమాండ్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎన్నిక జరగనుంది. దీంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ముందుగానే జాగ్రత్త పడుతోంది. తన ఖాతాలో ఉన్న 20 మంది కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా తన కౌన్సిలర్లను సమీపంలోని పెనుకొండ రిసార్టుకు తరలించింది. చైర్మన్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి 3న వారిని నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తీసుకువచ్చేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీంతో హిందూపురం మునిసిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2025 3:49 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…