Political News

బీఆర్ నాయుడు మార్క్!… సప్తగిరులు స్వర్ణ శోభితం!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ…ఈ అవకాశం దక్కదు.

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలు పెట్టగానే… టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగులో ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు యత్నించారు. నాయుడుకు స్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలను గుర్తించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆయనకే ఆ పదవిని అప్పగించారు. తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీఆర్ నాయుడు తనదైన శైలిలో తిరుమలలోని అక్రమాలపై దృష్టి సారించారు.

అక్రమార్కులను తరిమికొట్టారు కూడా. అయితే మొన్నటి తొక్కిసలాట ఘటనతో షాక్ గురైన నాయుడు… ఆ వెంటనే దాని నుంచి తేరుకుని వెంకన్న ఆలనాపాలనలో తనదైన ముద్రను వేసేందుకు నడుం బిగించారు.

శ్రీవారి భక్తులకే కాకుండా…తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు నాయుడు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండల సుందరీకరణలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి దారి తీసే మొదటి ఘాట్ రోడ్డులోని చివరలో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను ఏర్పాటు చేయించారు. ట్రయల్ రన్ కింద తొలుత 6 ల్యాంప్ లను ఏర్పాటు చేసిన టీటీడీ… ఆ తర్వాత అక్కడి వినాయక స్వామి ఆలయం వద్ద 25 ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.

ఇప్పుడీ ల్యాంప్ లు ఇస్తున్నకాంతితో విద్యుదీపాల కాంతుల్లో సప్తగిరులు వెలిగిపోతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన భక్తులు సప్త గిరులు స్వర్ణ శోభితం అయ్యాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఈ ఏర్పాటు ఉన్నా… జగన్ జమానాలో దీనిని నిలిపివేశారని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా. దానినే ఆయన తిరిగి పునరుద్ధరించారు

This post was last modified on January 29, 2025 4:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago