కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ…ఈ అవకాశం దక్కదు.
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలు పెట్టగానే… టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగులో ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు యత్నించారు. నాయుడుకు స్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలను గుర్తించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆయనకే ఆ పదవిని అప్పగించారు. తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీఆర్ నాయుడు తనదైన శైలిలో తిరుమలలోని అక్రమాలపై దృష్టి సారించారు.
అక్రమార్కులను తరిమికొట్టారు కూడా. అయితే మొన్నటి తొక్కిసలాట ఘటనతో షాక్ గురైన నాయుడు… ఆ వెంటనే దాని నుంచి తేరుకుని వెంకన్న ఆలనాపాలనలో తనదైన ముద్రను వేసేందుకు నడుం బిగించారు.
శ్రీవారి భక్తులకే కాకుండా…తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు నాయుడు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండల సుందరీకరణలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి దారి తీసే మొదటి ఘాట్ రోడ్డులోని చివరలో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను ఏర్పాటు చేయించారు. ట్రయల్ రన్ కింద తొలుత 6 ల్యాంప్ లను ఏర్పాటు చేసిన టీటీడీ… ఆ తర్వాత అక్కడి వినాయక స్వామి ఆలయం వద్ద 25 ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.
ఇప్పుడీ ల్యాంప్ లు ఇస్తున్నకాంతితో విద్యుదీపాల కాంతుల్లో సప్తగిరులు వెలిగిపోతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన భక్తులు సప్త గిరులు స్వర్ణ శోభితం అయ్యాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఈ ఏర్పాటు ఉన్నా… జగన్ జమానాలో దీనిని నిలిపివేశారని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా. దానినే ఆయన తిరిగి పునరుద్ధరించారు
This post was last modified on January 29, 2025 4:04 pm
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…