కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ…ఈ అవకాశం దక్కదు.
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలు పెట్టగానే… టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగులో ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు యత్నించారు. నాయుడుకు స్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలను గుర్తించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆయనకే ఆ పదవిని అప్పగించారు. తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీఆర్ నాయుడు తనదైన శైలిలో తిరుమలలోని అక్రమాలపై దృష్టి సారించారు.
అక్రమార్కులను తరిమికొట్టారు కూడా. అయితే మొన్నటి తొక్కిసలాట ఘటనతో షాక్ గురైన నాయుడు… ఆ వెంటనే దాని నుంచి తేరుకుని వెంకన్న ఆలనాపాలనలో తనదైన ముద్రను వేసేందుకు నడుం బిగించారు.
శ్రీవారి భక్తులకే కాకుండా…తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు నాయుడు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండల సుందరీకరణలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి దారి తీసే మొదటి ఘాట్ రోడ్డులోని చివరలో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను ఏర్పాటు చేయించారు. ట్రయల్ రన్ కింద తొలుత 6 ల్యాంప్ లను ఏర్పాటు చేసిన టీటీడీ… ఆ తర్వాత అక్కడి వినాయక స్వామి ఆలయం వద్ద 25 ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.
ఇప్పుడీ ల్యాంప్ లు ఇస్తున్నకాంతితో విద్యుదీపాల కాంతుల్లో సప్తగిరులు వెలిగిపోతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన భక్తులు సప్త గిరులు స్వర్ణ శోభితం అయ్యాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఈ ఏర్పాటు ఉన్నా… జగన్ జమానాలో దీనిని నిలిపివేశారని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా. దానినే ఆయన తిరిగి పునరుద్ధరించారు
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…