Political News

జీవీ రెడ్డి ఇరగదీస్తున్నారుగా!

ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పదవిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన నేరాల విషయంలో నిష్షాతుడిగా పేరు సంపాదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఈయన యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి… టీడీపీతో కలిసి సాగుతున్నారు. రెడ్డిగారి చురుకుదనం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఆయనకు మంచి గుర్తింపే ఇచ్చారు. తొలుత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చిన చంద్రబాబు… పార్టీ అదికారంలోకి రాగానే ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

పార్టీ అప్పగించిన పదవులను చేపట్టిన వారంతా ఎలా పనిచేస్తున్నారో తెలియదు గానీ… జీవీ రెడ్డి మాత్రం సత్తా చాటుతున్నారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… రెట్టింపు ఫలితాలను రాబడుతున్నారు. వైసీపీ జమానాలో చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదైన సంగతి తెలిసందే. ఈ కేసును కోర్టులు కొట్టివేసేలా జీవీ రెడ్డి మొత్తం రంగాన్ని సిద్ధం చేశారు. నాడు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పలు లోపాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టి మరీ జీవీ రెడ్డి ఇప్పుడు బయటకు తీశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు ఒకరు చేస్తే… ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫిర్యాదుదారుడిగా ఇంకొకరి పేరు ఉందట. ఇదే విషయాన్ని చార్జీ షీట్ లో గుర్తించిన కోర్టు..చార్జీషిట్ నే తిరస్కరించింది.

తాజాగా ఈ కేసులో ఏ1గా వేరే వ్యక్తి పేరు ఉండగా… ఆ తర్వాత ఆ వ్యక్తిని ఏ2గా మార్చేసి…ఏ1గా చంద్రబాబు పేరును చేర్చిన వైనాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీశారు. ఈ వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించి కేసును కొట్టివేయించే దిశగా రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఇక ఫైబర్ నెట్ లో వైసీపీ జమానాలో నియమితులై పనిచేయకుండానే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ నేతల అనుచరులు, వాళ్ల ఇంటి పని మనుషులను గుర్తించిన రెడ్డి… వారందరినీ ఒక్క దెబ్బతో ఇంటికి పంపించి వేశారు. ఈ చర్యతో జీవీ రెడ్డి పేరు మారుమోగిపోయింది.

ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఫైబర్ నెట్ ఖాతా నుంచి రూ.1.15 కోట్లు బదిలీ అయిన విషయాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీసుకువచ్చారు. అంతటితో ఆగని రెడ్డి… నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నిధులను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇందుకోసం వర్మకు 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ గడువు ముగిసిందంటే… వర్మపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడ్డి రంగం సిద్ధం చేసి ఉంచారు కూడా. ఎన్నికలకు ముందు టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యూహం పేరిట వర్మ ఓ సినిమా తీస్తే… దానికి నజరానాగా జగన్ సర్కారు ఫబర్ నెట్ నుంచి ఈ నిధులను ఆయనకు అందజేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా తన పరిధిలోని అన్ని విషయాల్లో సత్తా చాటుతున్న రెడ్డి… వైరి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

This post was last modified on January 29, 2025 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

4 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

4 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

7 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

7 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

7 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

9 hours ago