Political News

జీవీ రెడ్డి ఇరగదీస్తున్నారుగా!

ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పదవిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన నేరాల విషయంలో నిష్షాతుడిగా పేరు సంపాదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఈయన యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి… టీడీపీతో కలిసి సాగుతున్నారు. రెడ్డిగారి చురుకుదనం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఆయనకు మంచి గుర్తింపే ఇచ్చారు. తొలుత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చిన చంద్రబాబు… పార్టీ అదికారంలోకి రాగానే ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

పార్టీ అప్పగించిన పదవులను చేపట్టిన వారంతా ఎలా పనిచేస్తున్నారో తెలియదు గానీ… జీవీ రెడ్డి మాత్రం సత్తా చాటుతున్నారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… రెట్టింపు ఫలితాలను రాబడుతున్నారు. వైసీపీ జమానాలో చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదైన సంగతి తెలిసందే. ఈ కేసును కోర్టులు కొట్టివేసేలా జీవీ రెడ్డి మొత్తం రంగాన్ని సిద్ధం చేశారు. నాడు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పలు లోపాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టి మరీ జీవీ రెడ్డి ఇప్పుడు బయటకు తీశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు ఒకరు చేస్తే… ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫిర్యాదుదారుడిగా ఇంకొకరి పేరు ఉందట. ఇదే విషయాన్ని చార్జీ షీట్ లో గుర్తించిన కోర్టు..చార్జీషిట్ నే తిరస్కరించింది.

తాజాగా ఈ కేసులో ఏ1గా వేరే వ్యక్తి పేరు ఉండగా… ఆ తర్వాత ఆ వ్యక్తిని ఏ2గా మార్చేసి…ఏ1గా చంద్రబాబు పేరును చేర్చిన వైనాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీశారు. ఈ వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించి కేసును కొట్టివేయించే దిశగా రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఇక ఫైబర్ నెట్ లో వైసీపీ జమానాలో నియమితులై పనిచేయకుండానే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ నేతల అనుచరులు, వాళ్ల ఇంటి పని మనుషులను గుర్తించిన రెడ్డి… వారందరినీ ఒక్క దెబ్బతో ఇంటికి పంపించి వేశారు. ఈ చర్యతో జీవీ రెడ్డి పేరు మారుమోగిపోయింది.

ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఫైబర్ నెట్ ఖాతా నుంచి రూ.1.15 కోట్లు బదిలీ అయిన విషయాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీసుకువచ్చారు. అంతటితో ఆగని రెడ్డి… నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నిధులను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇందుకోసం వర్మకు 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ గడువు ముగిసిందంటే… వర్మపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడ్డి రంగం సిద్ధం చేసి ఉంచారు కూడా. ఎన్నికలకు ముందు టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యూహం పేరిట వర్మ ఓ సినిమా తీస్తే… దానికి నజరానాగా జగన్ సర్కారు ఫబర్ నెట్ నుంచి ఈ నిధులను ఆయనకు అందజేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా తన పరిధిలోని అన్ని విషయాల్లో సత్తా చాటుతున్న రెడ్డి… వైరి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

This post was last modified on January 29, 2025 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

57 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago