ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే… మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అంటూ షాకిస్తే,… సోమవారం సుప్రీంకోర్టులో పార్టీ అదినేత వైఎస్ జగన్ కు భారీ ఊరట లభించింది.
తాజాగా మంగళవారం జగన్ కు అత్యంత సన్నిహితుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి సురేశ్ బుధవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… నందిగం సురేశ్ టీడీపీని, ఇతరత్రా విపక్షాలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. దళిత సామజిక వర్గానికి చెందిన సురేశ్ గతంలో టీడీపీ అధికారంలో ఉండగానే… రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో సురేశ్ ను జగన్ దగ్గరికి తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల జాబితాను సురేశ్ తోనే విడుదల చేయించి జగన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగం విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…