ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే… మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అంటూ షాకిస్తే,… సోమవారం సుప్రీంకోర్టులో పార్టీ అదినేత వైఎస్ జగన్ కు భారీ ఊరట లభించింది.
తాజాగా మంగళవారం జగన్ కు అత్యంత సన్నిహితుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి సురేశ్ బుధవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… నందిగం సురేశ్ టీడీపీని, ఇతరత్రా విపక్షాలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. దళిత సామజిక వర్గానికి చెందిన సురేశ్ గతంలో టీడీపీ అధికారంలో ఉండగానే… రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో సురేశ్ ను జగన్ దగ్గరికి తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల జాబితాను సురేశ్ తోనే విడుదల చేయించి జగన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగం విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు.
This post was last modified on January 28, 2025 8:17 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…