ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది. వైసీపీ పాలనలో ఏబీవీపై రెండు పర్యాయాలు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్లను క్రమబద్ధీకరిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సస్పెన్షన్ కాలంలో ఏబీవీ కోల్పోయిన ఆర్థికపరైన నష్టం పూర్తిగా భర్తీ కానుంది. అంటే… సస్పెన్షన్ కాలానికి చెందిన వేతనాలు, ఇతర అలవెన్సులు ఇప్పుడు ఆయనకు అందనున్నాయి.
2019 ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీవీపై వైసీపీ దాదాపుగా కక్ష కట్టినంత పనిచేసింది. ఓ రాజకీయ నేతపై చేసే ఆరోపణలను మించి ఏబీవీని వైసీపీ టార్గెట్ చేసింది. నాడు విపక్షంగా తమపై ఏబీవీ నిఘా పెట్టారని, అందుకోసం ఏకంగా ఇజ్రాయెల్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలను కొనుగోలు చేశారని స్వయంగా జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏబీవీకి కష్టాలు మొదలయ్యాయి.
జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నంతనే ఏబీవీని బదిలీ చేసిన నాటి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం పాటు ఉంచేసింది. ఆ తర్వాత నిఘా పరికరాల కొనుగోలు కేసు నమోదు చేసి ఆయనను ఏకంగా సస్పెండ్ చేసింది. అయితే ఏబీవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలో ఏబీవీపై విధించిన సస్పెన్షన్ కాలం ముగియగానే… ఆయనపై మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది. చివరకు సుప్రీంకోర్టులో ఏబీవీకి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. చివరకు రిటైర్మెంట్ చివరి రోజున ఏదో అలా ఓ పోస్టింగ్ ఇచ్చి ఆయన పదవీ విరమణ పొందేలా చేసింది.
This post was last modified on January 28, 2025 7:36 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…