చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, రిబ్బన్ కటింగ్ సందర్భంగా చిరంజీవితో రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. అంతేకాదు, ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి రేవంత్ ప్రాధాన్యతనిచ్చారు.
ఆ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రామ్దేవ్ రావు అద్భుతాన్ని సృష్టించారని ప్రశంసించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దాంతోపాటు రాష్ట్ర విలువలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళికలు లేక తెలంగాణ ఆ రాష్ట్రాల స్థాయికి చేరుకోలేదని చెప్పారు.
సరైన సదుపాయాలున్నప్పటికీ తెలంగాణకు తగిని ప్రాముఖ్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజానికి ప్రభుత్వం, ప్రముఖులు తగినంత గుర్తింపు ఇవ్వలేదని, అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాలు వెనుకబడి పోయాయని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.
మెడికల్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ లో ఉన్న అడవిలో మెడిసనల్ ప్లాంట్స్ ఉన్నాయని, టీబీ పేషెంట్లు రెండు నెలల ఇక్కడ ఉంటే సహజసిద్ధంగా నయమవుతుందని సభలో చిరంజీవిని ఉద్దేశించి రేవంత్ చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు.
ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
This post was last modified on January 28, 2025 6:24 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…