Political News

చిరు చేయి వదలని రేవంత్… అరుదైన సీన్

చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, రిబ్బన్ కటింగ్ సందర్భంగా చిరంజీవితో రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. అంతేకాదు, ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి రేవంత్ ప్రాధాన్యతనిచ్చారు.

ఆ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రామ్‌దేవ్ రావు అద్భుతాన్ని సృష్టించారని ప్రశంసించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దాంతోపాటు రాష్ట్ర విలువలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళికలు లేక తెలంగాణ ఆ రాష్ట్రాల స్థాయికి చేరుకోలేదని చెప్పారు.

సరైన సదుపాయాలున్నప్పటికీ తెలంగాణకు తగిని ప్రాముఖ్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజానికి ప్రభుత్వం, ప్రముఖులు తగినంత గుర్తింపు ఇవ్వలేదని, అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాలు వెనుకబడి పోయాయని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.

మెడికల్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ లో ఉన్న అడవిలో మెడిసనల్ ప్లాంట్స్ ఉన్నాయని, టీబీ పేషెంట్లు రెండు నెలల ఇక్కడ ఉంటే సహజసిద్ధంగా నయమవుతుందని సభలో చిరంజీవిని ఉద్దేశించి రేవంత్ చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు.

ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on January 28, 2025 6:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

14 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago