Political News

చిరు చేయి వదలని రేవంత్… అరుదైన సీన్

చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, రిబ్బన్ కటింగ్ సందర్భంగా చిరంజీవితో రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. అంతేకాదు, ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి రేవంత్ ప్రాధాన్యతనిచ్చారు.

ఆ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రామ్‌దేవ్ రావు అద్భుతాన్ని సృష్టించారని ప్రశంసించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దాంతోపాటు రాష్ట్ర విలువలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళికలు లేక తెలంగాణ ఆ రాష్ట్రాల స్థాయికి చేరుకోలేదని చెప్పారు.

సరైన సదుపాయాలున్నప్పటికీ తెలంగాణకు తగిని ప్రాముఖ్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజానికి ప్రభుత్వం, ప్రముఖులు తగినంత గుర్తింపు ఇవ్వలేదని, అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాలు వెనుకబడి పోయాయని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.

మెడికల్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ లో ఉన్న అడవిలో మెడిసనల్ ప్లాంట్స్ ఉన్నాయని, టీబీ పేషెంట్లు రెండు నెలల ఇక్కడ ఉంటే సహజసిద్ధంగా నయమవుతుందని సభలో చిరంజీవిని ఉద్దేశించి రేవంత్ చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు.

ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on January 28, 2025 6:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

23 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

29 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

40 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

1 hour ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

5 hours ago