Political News

చిరు చేయి వదలని రేవంత్… అరుదైన సీన్

చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, రిబ్బన్ కటింగ్ సందర్భంగా చిరంజీవితో రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. అంతేకాదు, ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి రేవంత్ ప్రాధాన్యతనిచ్చారు.

ఆ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రామ్‌దేవ్ రావు అద్భుతాన్ని సృష్టించారని ప్రశంసించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దాంతోపాటు రాష్ట్ర విలువలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళికలు లేక తెలంగాణ ఆ రాష్ట్రాల స్థాయికి చేరుకోలేదని చెప్పారు.

సరైన సదుపాయాలున్నప్పటికీ తెలంగాణకు తగిని ప్రాముఖ్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజానికి ప్రభుత్వం, ప్రముఖులు తగినంత గుర్తింపు ఇవ్వలేదని, అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాలు వెనుకబడి పోయాయని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.

మెడికల్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ లో ఉన్న అడవిలో మెడిసనల్ ప్లాంట్స్ ఉన్నాయని, టీబీ పేషెంట్లు రెండు నెలల ఇక్కడ ఉంటే సహజసిద్ధంగా నయమవుతుందని సభలో చిరంజీవిని ఉద్దేశించి రేవంత్ చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు.

ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on January 28, 2025 6:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago