రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్గి చేసిన ప్రకటన… వైసీపీని ఓ రేంజిలో వణికించిందనే చెప్పాలి. సాయిరెడ్డితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడనున్నారన్న వార్తలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఇలా సాయిరెడ్డితో పాటు కలిసి పార్టీకి దూరంగా జరిగే నేతల జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న అయోధ్య రెడ్డి సాయిరెడ్డి వెంట నడవడం ఖాయమన్న వాదనలూ వినిపించాయి.
సాయిరెడ్డి ప్రకటన చేసిన సమయంలో దావోస్ సదస్సులో ఉన్న అయోధ్య రెడ్డి తాను వైసీపీని వీడటం లేదని తెలిపారు. అయితే తాజాగా ఆయన విజయవాడ చేరుకున్నారు. నిన్న రాత్రికే హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజాగా మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ ఎయిర్ పోర్టుకు రాగా…జోగితో కలిసి ఒకే కారులో అయోధ్య రెడ్డి విజయవాడ వెళ్లారు.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో అయోధ్య రెడ్డిని మీడియా ప్రతినిధులు కదలించగా.. తానేమీ వైసీపీని వీడటం లేదని తెలిపారు. అంతేకాకుండా సాయిరెడ్డి వ్యవహారంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతమని అయోధ్య తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి ఉండటం సహజమేనని ఆయన అన్నారు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలపై ఏ రీతిన ఒత్తిడి ఉందో ఎమ్మెల్సీలపైనా అంతే స్థాయిలో ఓత్తిడి ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.
This post was last modified on January 28, 2025 1:55 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…