రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్గి చేసిన ప్రకటన… వైసీపీని ఓ రేంజిలో వణికించిందనే చెప్పాలి. సాయిరెడ్డితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడనున్నారన్న వార్తలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఇలా సాయిరెడ్డితో పాటు కలిసి పార్టీకి దూరంగా జరిగే నేతల జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న అయోధ్య రెడ్డి సాయిరెడ్డి వెంట నడవడం ఖాయమన్న వాదనలూ వినిపించాయి.
సాయిరెడ్డి ప్రకటన చేసిన సమయంలో దావోస్ సదస్సులో ఉన్న అయోధ్య రెడ్డి తాను వైసీపీని వీడటం లేదని తెలిపారు. అయితే తాజాగా ఆయన విజయవాడ చేరుకున్నారు. నిన్న రాత్రికే హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజాగా మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ ఎయిర్ పోర్టుకు రాగా…జోగితో కలిసి ఒకే కారులో అయోధ్య రెడ్డి విజయవాడ వెళ్లారు.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో అయోధ్య రెడ్డిని మీడియా ప్రతినిధులు కదలించగా.. తానేమీ వైసీపీని వీడటం లేదని తెలిపారు. అంతేకాకుండా సాయిరెడ్డి వ్యవహారంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతమని అయోధ్య తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి ఉండటం సహజమేనని ఆయన అన్నారు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలపై ఏ రీతిన ఒత్తిడి ఉందో ఎమ్మెల్సీలపైనా అంతే స్థాయిలో ఓత్తిడి ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.
This post was last modified on January 28, 2025 1:55 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…