Political News

ఒత్తిడి సహజమే.. తట్టుకుని నిలబడాలి: అయోధ్య రెడ్డి

రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్గి చేసిన ప్రకటన… వైసీపీని ఓ రేంజిలో వణికించిందనే చెప్పాలి. సాయిరెడ్డితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడనున్నారన్న వార్తలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఇలా సాయిరెడ్డితో పాటు కలిసి పార్టీకి దూరంగా జరిగే నేతల జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న అయోధ్య రెడ్డి సాయిరెడ్డి వెంట నడవడం ఖాయమన్న వాదనలూ వినిపించాయి.

సాయిరెడ్డి ప్రకటన చేసిన సమయంలో దావోస్ సదస్సులో ఉన్న అయోధ్య రెడ్డి తాను వైసీపీని వీడటం లేదని తెలిపారు. అయితే తాజాగా ఆయన విజయవాడ చేరుకున్నారు. నిన్న రాత్రికే హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజాగా మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ ఎయిర్ పోర్టుకు రాగా…జోగితో కలిసి ఒకే కారులో అయోధ్య రెడ్డి విజయవాడ వెళ్లారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో అయోధ్య రెడ్డిని మీడియా ప్రతినిధులు కదలించగా.. తానేమీ వైసీపీని వీడటం లేదని తెలిపారు. అంతేకాకుండా సాయిరెడ్డి వ్యవహారంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతమని అయోధ్య తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి ఉండటం సహజమేనని ఆయన అన్నారు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలపై ఏ రీతిన ఒత్తిడి ఉందో ఎమ్మెల్సీలపైనా అంతే స్థాయిలో ఓత్తిడి ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.

This post was last modified on January 28, 2025 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago