కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాకపోవడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులుంటే పథకాలు అమలు చేయడానికి నిమిషం ఆలస్యం చేయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏ మాత్రం ఫ్లెక్సిబిలిటీ దొరికినా పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం, ఏడీబీ బ్యాంకు నిధులు కేటాయించాయని, కానీ, ఆ నిధులను తాను సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తానని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని, అందుకే పథకాలు సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
This post was last modified on January 27, 2025 8:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…