కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాకపోవడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులుంటే పథకాలు అమలు చేయడానికి నిమిషం ఆలస్యం చేయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏ మాత్రం ఫ్లెక్సిబిలిటీ దొరికినా పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం, ఏడీబీ బ్యాంకు నిధులు కేటాయించాయని, కానీ, ఆ నిధులను తాను సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తానని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని, అందుకే పథకాలు సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
This post was last modified on January 27, 2025 8:35 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…