కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాకపోవడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులుంటే పథకాలు అమలు చేయడానికి నిమిషం ఆలస్యం చేయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏ మాత్రం ఫ్లెక్సిబిలిటీ దొరికినా పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం, ఏడీబీ బ్యాంకు నిధులు కేటాయించాయని, కానీ, ఆ నిధులను తాను సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తానని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని, అందుకే పథకాలు సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
This post was last modified on January 27, 2025 8:35 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…