Political News

పథకాల అమలులో జాప్యంపై చంద్రబాబు క్లారిటీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాకపోవడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

డబ్బులుంటే పథకాలు అమలు చేయడానికి నిమిషం ఆలస్యం చేయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏ మాత్రం ఫ్లెక్సిబిలిటీ దొరికినా పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం, ఏడీబీ బ్యాంకు నిధులు కేటాయించాయని, కానీ, ఆ నిధులను తాను సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తానని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని, అందుకే పథకాలు సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

This post was last modified on January 27, 2025 8:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

2 minutes ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago