ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వార్ కు తెర తీశారు. విధ్వంసక భావజాలంతో సాగిన గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డులను ఇవ్వబోమంటూ సంజయ్ సోమవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వేగంగానే కాకుండా ఘాటుగానే తప్పికొట్టే యత్నం చేసింది.
గద్దర్ మరణించిన సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా గద్దర్ సతీమణి విమలకు ఓ లేక రాసిన సంగతి తెలిసిందే. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ లేఖను బయటకు తీసింది. గద్దర్ విధ్వంసక భావజాలంతో కొనసాగిన విషయం నాడు ప్రధానిగా ఉన్న మీ పార్టీ నేత మోదీకి తెలియలేదా?… లేదంటే గుర్తు లేదా? అంటూ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఘాటుగానే స్పందించింది.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ గణతంత్ర దినోత్సవం నాడే సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ లాంటి వారికి అవార్డులు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పంపామని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్… బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డులను ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on January 27, 2025 8:36 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…