ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వార్ కు తెర తీశారు. విధ్వంసక భావజాలంతో సాగిన గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డులను ఇవ్వబోమంటూ సంజయ్ సోమవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వేగంగానే కాకుండా ఘాటుగానే తప్పికొట్టే యత్నం చేసింది.
గద్దర్ మరణించిన సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా గద్దర్ సతీమణి విమలకు ఓ లేక రాసిన సంగతి తెలిసిందే. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ లేఖను బయటకు తీసింది. గద్దర్ విధ్వంసక భావజాలంతో కొనసాగిన విషయం నాడు ప్రధానిగా ఉన్న మీ పార్టీ నేత మోదీకి తెలియలేదా?… లేదంటే గుర్తు లేదా? అంటూ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఘాటుగానే స్పందించింది.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ గణతంత్ర దినోత్సవం నాడే సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ లాంటి వారికి అవార్డులు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పంపామని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్… బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డులను ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on January 27, 2025 8:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…