Political News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు.

రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతూ ఉంటే.. ప్రజలకు గుడ్ న్యూస్ ఏమిటీ? అంటారా? అయితే… మంత్రి చేసిన ప్రకటన సారాంశంలోకి వెళ్లిపోదాం పదండి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకరీతిన ఉన్నాయి. అంటే… పట్టణాలను అలా పక్కనపెడితే… పల్లెల్లో వేల రూపాయల విలువ చేసే భూములను కొనాలంటే కూడా లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.50 వేల విలువ చేసే భూమిని కొనాలంటే…ఏకంగా దానికి ఇతర విలువైన భూముల మాదిరే రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే… చారాణా కోడికి బారాణా మసాలా అన్నమాట.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు నిర్దేశిత సమయానికే పూర్తి అయ్యి ఉంటే… జనవరి 1 నుంచిే భూముల ధరల పెంపు అమల్లోకి వచ్చేది. అయితే భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వరకే పరిమితం కాని చంద్రబాబు సర్కారు… ఆయా ధరలను హేతుబద్దీకరణ చేసేందుకు పూనుకుంది. అంటే… డిమాండ్ ఉన్న చోట భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి. అదే సమయంలో డిమాండ్ లేని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయన్న మాట.

ఇదిలా ఉంటే… అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచ స్థాయి సంస్థలను రాబట్టే ఉద్దేశంతో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయడం లేదు.అదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ విభిన్న నిర్ణయంతో పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న భూములు భారీ స్థాయిలో సాగు వినియోగంలోకి రానున్నాయని చెప్పాలి.

This post was last modified on January 27, 2025 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago