Political News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు.

రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతూ ఉంటే.. ప్రజలకు గుడ్ న్యూస్ ఏమిటీ? అంటారా? అయితే… మంత్రి చేసిన ప్రకటన సారాంశంలోకి వెళ్లిపోదాం పదండి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకరీతిన ఉన్నాయి. అంటే… పట్టణాలను అలా పక్కనపెడితే… పల్లెల్లో వేల రూపాయల విలువ చేసే భూములను కొనాలంటే కూడా లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.50 వేల విలువ చేసే భూమిని కొనాలంటే…ఏకంగా దానికి ఇతర విలువైన భూముల మాదిరే రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే… చారాణా కోడికి బారాణా మసాలా అన్నమాట.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు నిర్దేశిత సమయానికే పూర్తి అయ్యి ఉంటే… జనవరి 1 నుంచిే భూముల ధరల పెంపు అమల్లోకి వచ్చేది. అయితే భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వరకే పరిమితం కాని చంద్రబాబు సర్కారు… ఆయా ధరలను హేతుబద్దీకరణ చేసేందుకు పూనుకుంది. అంటే… డిమాండ్ ఉన్న చోట భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి. అదే సమయంలో డిమాండ్ లేని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయన్న మాట.

ఇదిలా ఉంటే… అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచ స్థాయి సంస్థలను రాబట్టే ఉద్దేశంతో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయడం లేదు.అదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ విభిన్న నిర్ణయంతో పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న భూములు భారీ స్థాయిలో సాగు వినియోగంలోకి రానున్నాయని చెప్పాలి.

This post was last modified on January 27, 2025 3:35 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

6 minutes ago

కాకా ఎప్పుడు వస్తే బాగుంటుంది

2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…

14 minutes ago

ఎప్పట్లాగే టీజర్ పేలింది… మరి సినిమా?

తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్,…

38 minutes ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

5 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

12 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

13 hours ago