Political News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు.

రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతూ ఉంటే.. ప్రజలకు గుడ్ న్యూస్ ఏమిటీ? అంటారా? అయితే… మంత్రి చేసిన ప్రకటన సారాంశంలోకి వెళ్లిపోదాం పదండి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకరీతిన ఉన్నాయి. అంటే… పట్టణాలను అలా పక్కనపెడితే… పల్లెల్లో వేల రూపాయల విలువ చేసే భూములను కొనాలంటే కూడా లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.50 వేల విలువ చేసే భూమిని కొనాలంటే…ఏకంగా దానికి ఇతర విలువైన భూముల మాదిరే రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే… చారాణా కోడికి బారాణా మసాలా అన్నమాట.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు నిర్దేశిత సమయానికే పూర్తి అయ్యి ఉంటే… జనవరి 1 నుంచిే భూముల ధరల పెంపు అమల్లోకి వచ్చేది. అయితే భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వరకే పరిమితం కాని చంద్రబాబు సర్కారు… ఆయా ధరలను హేతుబద్దీకరణ చేసేందుకు పూనుకుంది. అంటే… డిమాండ్ ఉన్న చోట భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి. అదే సమయంలో డిమాండ్ లేని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయన్న మాట.

ఇదిలా ఉంటే… అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచ స్థాయి సంస్థలను రాబట్టే ఉద్దేశంతో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయడం లేదు.అదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ విభిన్న నిర్ణయంతో పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న భూములు భారీ స్థాయిలో సాగు వినియోగంలోకి రానున్నాయని చెప్పాలి.

This post was last modified on January 27, 2025 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

41 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago