టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు ఓ పెద్ద పోరాటమే చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు రాసిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియాను ఆయన ఏకంగా కోర్టుకు లాగిన సంగతి తెలిసిందే. సాక్షిపై లోకేశ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా విశాఖలోని ’12వ అదనపు జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ విచారణకు హాజరైన లోకేశ్… తాజాగా సోమవారం జరగనున్న విచారణకూ హాజరవుతున్నారు.
ఈ విచారణ సందర్భంగా లోకేశ్ ను సాక్షి తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సాక్షి లాయర్లు లోకేశ్ ను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే యత్నం చేశారట. అయితే వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చిన లోకేశ్… వారి సహనాన్ని పరీక్షించేలా చేశారట. తాజాగా సోమవారం నాటి క్రాస్ ఎగ్జామినేషన్ కూ లోకేశ్ ఫుల్లుగానే ప్రిపేర్ అయినట్లుగా సమాచారం. అంటే.. ఈ దఫా కూడా సాక్షి లాయర్లకు లోకేశ్ చుక్కలు చూపడం ఖాయమేనని తెలుస్తోంది.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో లోకేశ్ విశాఖ ఎయిర్ పోర్టులో స్నాక్స్ కోసం ప్రజా ధనాన్ని లక్షల మేర దుర్వినియోగం చేశారంటూ సాక్షి పత్రిక ‘చినబాబు చిరుతిండి… 25 లక్షలండి’ పేరిట ఓ కథనాన్ని రాసింది. ఈ కథనంపై నాడు లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనానికి సారీ చెప్పాలంటూ సాక్షికి లోకేశ్ నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సాక్షి స్పందించకపోవడంతో లోకేశ్ ఆ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సాక్షికి గట్టిగా గుణపాఠం చెప్పాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ కేసు విచారణను ఆయన సీరియస్ గా పరిగణిస్తున్నారు.
This post was last modified on January 27, 2025 10:26 am
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…