టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ మంత్రిని పలకరించినా.. హడావిడిగా కదిలిపోతున్నారే తప్పించి.. గతంలో మాదిరిగా ఒకింత నిలబడి సమాధానాలు చెబుతున్న వైనం అస్సలు కనిపించడం లేదు. ఏదో అత్యవసర కార్యక్రమాలు ఉన్నట్లుగా మంత్రులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ కార్యాలయాలు తప్పించి… మంత్రులు బయట ఎక్కడా పెద్దగా కనిపించడమే లేదు.
మంత్రుల్లో అంతగా టెన్షన్ వాతావరణం ఎందుకు కనిపిస్తోందన్న విషయానికి వస్తే… తన కేబినెట్ లోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మదింపు చేస్తున్నారు. అందుకోసం ఆయా శాఖల నుంచి ఆయన ప్రత్యేకంగా నివేదికలు కోరారు. మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి డిసెంబర్ దాకా ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు ఎలా ఉందన్న అంశాన్ని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆయన విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ శాఖలను పర్యవేక్షిస్తూ ఉంటే… ఆయా శాఖల వారీగా మంత్రుల పనితీరును వేర్వేరుగానే పంపాలని కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం మంత్రులంతా ఈ నివేదికల రూపకల్పనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో పలువురు సీనియర్ మంత్రులున్నా.. చాలా మంది కొత్త వారే ఉన్నారు. మంత్రుల పనితీరు మదింపునకు సంబంధించి సీనియర్లకు ఓ మోస్తరు అవగాహన ఉన్నా.. కొత్తగా మంత్రులుగా పదవులు దక్కించుకున్న వారిలో మాత్రం ఆ నివేదికలతో తమ పరిస్థితి ఎలా మారుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడిదాకా పరిస్థితి ఓ మోస్తరుగానే ఉన్నా… ఈ నివేదికల ద్వారా మంత్రుల పనితీరును మదింపు చేసి.. పనితీరు లేని వారిపై చర్యలుంటాయని సీఎం చెప్పడంతో మొత్తం మంత్రులందరిలో టెన్షన్ నెలకొంది.
This post was last modified on January 27, 2025 10:21 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…