Political News

బాబును చూసి అయినా నేర్చుకోండబ్బా!

నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో విరుచుకుపడాలో… ఏ విషయంలో నిగ్రహంతో మెలగాలో తెలిసిన నేత. తనలోని భావాలను అణచుకునే శక్తి కలిగిన నేత. ఇతరుల విషయాల్లో అసలు వేలు పెట్టేందుకు ససేమిరా అనే నిబద్ధత కలిగిన నేత. ఇక వ్యూహాలను అమలు చేయడంలో చతురత కలిగిన నేతగా చంద్రబాబుకు మంచి రికార్డులే ఉన్నాయి.

దాదాపుగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు..తన రాష్ట్రం, తన రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తూ… జాతీయ రాజకీయాల్లో ఎంత కల్పించుకోవాలో.. అంతవరకే కల్పించుకుంటూ సాగుతున్న నేతగా అందరికీ ఆదర్శవంతుడు. అలాంటి నేతను చూస్తూ… ఆయనతో కలిసి ఏళ్లుగా నడుస్తూ సాగుతున్న నేతలు చాలా మంది నేతలు..ఆయనలోని సుగుణాలను అవరచుకోవడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. అసలు మన లిమిట్ ఎంతవరకు అన్న విషయాన్ని చంద్రబాబును చూసి ప్రతి రాజకీయ నేత కూడా నేర్చుకోవాలన్న వాదనలు గడచిన రెండు రోజులుగా బాగానే వినిపిస్తున్నాయి.

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన వైనం గుర్తుంది కదా. తన వ్యక్తిగత కారనాలతో రాజకీాయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సాయిరెడ్డి… రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే వైరి వర్తాలుగా అటు టీడీపీ అయినా, ఇటు బీజేపీ, జనసేనలకు చెందిన నేతలైనా సాయిరెడ్డి నిష్క్రమణపై స్పందించవచ్చు. అయితే ఎంతవరకు స్పందించాలన్న దానిని మాత్రం ఎవరికి వారే నిర్దేశించుకోవాలి. ఈ విషయంలో అందరు నేతలకు చంద్రబాబు ఆదర్శమని చెప్పక తప్పదు.

దావోస్ పర్యటన వివరాలు వెల్లడించేందుకు శనివారం మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు… సాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై వచ్చిన ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా స్పందించారు. ఆ విషయం వైసీపీ అంతర్గత విషయమని చంద్రబాబు తేల్చి పారేశారు. అంతేకాకుండా నాయకులు నమ్మకం కోల్పోతే ఆ పార్టీలో నేతలు నిలబడరని చెప్పిన చంద్రబాబు.. ఆ పరిస్థితి వైసీపికి సరిగ్గా సరిపోతుంది అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి తాను ఆ విషయంపై స్పందించలేనని కూడా చంద్రబాబు ఓపెన్ గానే చెప్పేశారు.

సాయిరెడ్ది రాజకీయ సన్యాసం నిజంగానే వైసీపీ అంతర్గత వ్యవహారం. అదేదో తమకు నష్టం చేకూర్చిందన్నట్లుగా చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సాయిరెడ్ది సన్యాసంపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అయితే వీరంతా ఎంతగా నోరు పారేసుకున్నా.. చంద్రబాబు సౌమ్యంగా చేసిన వ్యాఖ్యలే వైసీపీకి చెంపపెట్టులా నిలిచాయని చెప్పాలి. జగన్ పేరు ఎత్తకుండానే…నాయకుడు నమ్మకం కోల్పోయారంటూ చంద్రబాబు చేసిన కామెంట్ నిజంగానే వైసీపీలోని తాజా పరిస్థితిని జనం కళ్లకు కట్టింది. అంతలా నోరేసుకుని విరుచుకుపడిన నేతల విమర్శలు చంద్రబాబు స్పందనకు వచ్చిన ఫలితంలో ఆవగింజంత కూడా సాధించలేకపోయాయి.

అదేంటీ.. వైసీపీ అదికారంలో ఉండగా… సాయిరెడ్డి తమను దారుణంగా దూషించారని, అలాంటిది ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పించుకుని పారిపోతే నోరు మూసుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించే నేతలు కూడా ఉన్నారు. ఈ విషయానికి వచ్చినా.. అందరి కంటే కూడా సాయిరెడ్డి అంశంపై చంద్రబాబే ఘాటుగా స్పందించాలి. ఎందుకంటే… నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి సంధించిన పోస్టులను ఓ సారి గుర్తు చేసుకుంటే… ఈ మాట వాస్తవమేనని చెప్పాలి. సాయిరెడ్డి నుంచి దారుణమైన దూషణలను తిన్న చంద్రబాబే అంత నిగ్రహం పాటించి రాజకీయాలకు విలువ తీసుకొస్తుంటే…ఆయన కింద ఉన్న నేతలు మాత్రం ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.

Satya

Recent Posts

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

6 minutes ago

వదిలేయడమే అఖిల్ చేసుకున్న అదృష్టం

లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…

29 minutes ago

వివేకాను చంపించింది జగనే: లోకేశ్

ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

2 hours ago

రుక్మిణి వసంత్… ఇంకో మెగా మూవీలో?

‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…

2 hours ago

మసూద దర్శకుడు… ఎట్టకేలకు

తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…

3 hours ago

బేబీ డబ్బులు ఇంకా రాలేదా?

తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…

3 hours ago