Political News

బాబును చూసి అయినా నేర్చుకోండబ్బా!

నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో విరుచుకుపడాలో… ఏ విషయంలో నిగ్రహంతో మెలగాలో తెలిసిన నేత. తనలోని భావాలను అణచుకునే శక్తి కలిగిన నేత. ఇతరుల విషయాల్లో అసలు వేలు పెట్టేందుకు ససేమిరా అనే నిబద్ధత కలిగిన నేత. ఇక వ్యూహాలను అమలు చేయడంలో చతురత కలిగిన నేతగా చంద్రబాబుకు మంచి రికార్డులే ఉన్నాయి.

దాదాపుగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు..తన రాష్ట్రం, తన రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తూ… జాతీయ రాజకీయాల్లో ఎంత కల్పించుకోవాలో.. అంతవరకే కల్పించుకుంటూ సాగుతున్న నేతగా అందరికీ ఆదర్శవంతుడు. అలాంటి నేతను చూస్తూ… ఆయనతో కలిసి ఏళ్లుగా నడుస్తూ సాగుతున్న నేతలు చాలా మంది నేతలు..ఆయనలోని సుగుణాలను అవరచుకోవడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. అసలు మన లిమిట్ ఎంతవరకు అన్న విషయాన్ని చంద్రబాబును చూసి ప్రతి రాజకీయ నేత కూడా నేర్చుకోవాలన్న వాదనలు గడచిన రెండు రోజులుగా బాగానే వినిపిస్తున్నాయి.

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన వైనం గుర్తుంది కదా. తన వ్యక్తిగత కారనాలతో రాజకీాయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సాయిరెడ్డి… రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే వైరి వర్తాలుగా అటు టీడీపీ అయినా, ఇటు బీజేపీ, జనసేనలకు చెందిన నేతలైనా సాయిరెడ్డి నిష్క్రమణపై స్పందించవచ్చు. అయితే ఎంతవరకు స్పందించాలన్న దానిని మాత్రం ఎవరికి వారే నిర్దేశించుకోవాలి. ఈ విషయంలో అందరు నేతలకు చంద్రబాబు ఆదర్శమని చెప్పక తప్పదు.

దావోస్ పర్యటన వివరాలు వెల్లడించేందుకు శనివారం మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు… సాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై వచ్చిన ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా స్పందించారు. ఆ విషయం వైసీపీ అంతర్గత విషయమని చంద్రబాబు తేల్చి పారేశారు. అంతేకాకుండా నాయకులు నమ్మకం కోల్పోతే ఆ పార్టీలో నేతలు నిలబడరని చెప్పిన చంద్రబాబు.. ఆ పరిస్థితి వైసీపికి సరిగ్గా సరిపోతుంది అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి తాను ఆ విషయంపై స్పందించలేనని కూడా చంద్రబాబు ఓపెన్ గానే చెప్పేశారు.

సాయిరెడ్ది రాజకీయ సన్యాసం నిజంగానే వైసీపీ అంతర్గత వ్యవహారం. అదేదో తమకు నష్టం చేకూర్చిందన్నట్లుగా చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సాయిరెడ్ది సన్యాసంపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అయితే వీరంతా ఎంతగా నోరు పారేసుకున్నా.. చంద్రబాబు సౌమ్యంగా చేసిన వ్యాఖ్యలే వైసీపీకి చెంపపెట్టులా నిలిచాయని చెప్పాలి. జగన్ పేరు ఎత్తకుండానే…నాయకుడు నమ్మకం కోల్పోయారంటూ చంద్రబాబు చేసిన కామెంట్ నిజంగానే వైసీపీలోని తాజా పరిస్థితిని జనం కళ్లకు కట్టింది. అంతలా నోరేసుకుని విరుచుకుపడిన నేతల విమర్శలు చంద్రబాబు స్పందనకు వచ్చిన ఫలితంలో ఆవగింజంత కూడా సాధించలేకపోయాయి.

అదేంటీ.. వైసీపీ అదికారంలో ఉండగా… సాయిరెడ్డి తమను దారుణంగా దూషించారని, అలాంటిది ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పించుకుని పారిపోతే నోరు మూసుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించే నేతలు కూడా ఉన్నారు. ఈ విషయానికి వచ్చినా.. అందరి కంటే కూడా సాయిరెడ్డి అంశంపై చంద్రబాబే ఘాటుగా స్పందించాలి. ఎందుకంటే… నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి సంధించిన పోస్టులను ఓ సారి గుర్తు చేసుకుంటే… ఈ మాట వాస్తవమేనని చెప్పాలి. సాయిరెడ్డి నుంచి దారుణమైన దూషణలను తిన్న చంద్రబాబే అంత నిగ్రహం పాటించి రాజకీయాలకు విలువ తీసుకొస్తుంటే…ఆయన కింద ఉన్న నేతలు మాత్రం ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.

This post was last modified on January 27, 2025 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు…

3 hours ago

యాంకర్ అబ్బాయికి భలే మంచి ఛాన్స్

రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…

5 hours ago

ఏప్రిల్ 11 – ఓటిటి అభిమానులకు పండగే

థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…

6 hours ago

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

9 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

9 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

10 hours ago