జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను పదే పదే ప్రస్తావించిన పవన్… పార్టీ శ్రేణులు పాటించి తీరాల్సిన అంశాలను విస్పష్టంగా వెల్లడించారు. అనవసరం అన్న పదానికి ఆమడ దూరంలో ఉండాలన్న భావన వచ్చేలా పవన్ పేరిట జనసేన జారీ చేసిన ప్రకటన జన సైనికుల్లోనే కాకుండా కూటమి పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల ముందు పరిస్థితిని పవన్ ఈ ప్రకటనలో కూలంకషంగా వివరించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పూసగుచ్చినట్లు వివరించిన పవన్… ఆ కారణంగానే మూడు పార్టీలతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు.
కూటమి పార్టీల గెలుపు శాతం 94 శాతమే అయితే… అందులో జనసేన సక్సెస్ రేటు సెంట్ పర్సెంట్ అన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇంత భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు కూడా సంయమనంతో వ్యవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
అయినా జనసైనికులకు పవన్ పెట్టిన కొత్త కండీషన్లు ఏమిటన్న విషయానికి వస్తే… అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై గానీ… కూటమి అంతర్గత విషయాలపై గానీ పొరపాటుగా నాయకులు స్పందించినా..అందుకు ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చరాదని ఆయన కోరారు.
అంతేకాకుండా ఈ తరహా విషయాలపై బహిరంగ చర్చలు చేయరాదని కూడా ఆయన జనసైనికులను కోరారు. వెరసి కూటమి పటిష్టతకు హానీ చేసే ఏ ఒక్క విషయంపై అసలు స్పందించవద్దని ఆయన పార్టీ శ్రుేణులను కోరారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ కట్టుబాట్లకు కట్టుబడాల్సిందేనని కూడా పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
This post was last modified on January 26, 2025 11:18 pm
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…