పరిపాలనా దక్షతలో చంద్రబాబుకు మించినోడు ఉండరని.. ఎవరిని ఏ పనికి వాడుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలుగు తమ్ముళ్లు అయితే.. ఈ విషయాన్ని చిలువలు వలువలుగా చెప్పుకుంటుంటారు.
అంత మంచి ఆడ్మినిస్ట్రేర్ అయిన బాబుకు.. తన గురించి తాను ఎప్పుడు మాట్లాడుకోవాలో? ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలీదా? అన్నది అసలు ప్రశ్న. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎవరి గొప్పతనం గురించి వారు చెప్పుకుంటే బాగోదు. అందులోకి బాబు లాంటి వారికి అస్సలు సూట్ కాదు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగతే చూడండి. అబద్ధాల్ని సైతం ఎంత అందంగా చెబుతారో ఆయన దగ్గరే చూసి నేర్చుకోవాలి. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే. ఆ విషయంలో మారో మాటకు తావు లేదని చెప్పటమే కాదు.. తేడా వస్తే తన తల తెగుతుందే తప్పించి.. మాట తేడా అన్నది తన వంశంలోనే ఉండదన్న మాట మాట్లాడతారు. మరేం జరిగిందో అందరికి తెలుసు. మరి.. ఆ విషయాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. ఎవరైనా ఆ దుస్సాహసం చేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో సారుకు బాగా తెలుసు.
కానీ.. బాబుకు ఇలాంటి విషయాల మీద పట్టు తక్కువే. తన మనసుకు తోచింది చెప్పుసుకుంటూ పోవటమే. చివరకు తాను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసిన విషయాన్ని ఆయనే చెప్పుకోవాలే తప్పించి.. అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో నేతలెవరూ ప్రస్తావించరు. తనకున్న విజన్ గురించి బాబు చెప్పుకోవాల్సిన దుస్థితి. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయానికి వస్తే ఆయనకున్న దూరదృష్టి గురించి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తుంది.
ఏడేళ్ల క్రితం తాను చేసిన పాదయాత్ర ముగింపు గురించి.. ఆ సందర్భంగా తాను పడిన శ్రమ గురించి బాబే చెప్పుకోవాలే కానీ.. ఆయన విధేయులెవరూ ముందుకు రారు. ఎంతసేపటికి తన డప్పు తాను కొట్టుకోవటమే కానీ..సమయానికి అనుగుణంగా బాబు డప్పును తమ్ముళ్లు కొడితే బాగుంటుంది కదా?
This post was last modified on April 29, 2020 3:03 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…