పరిపాలనా దక్షతలో చంద్రబాబుకు మించినోడు ఉండరని.. ఎవరిని ఏ పనికి వాడుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలుగు తమ్ముళ్లు అయితే.. ఈ విషయాన్ని చిలువలు వలువలుగా చెప్పుకుంటుంటారు.
అంత మంచి ఆడ్మినిస్ట్రేర్ అయిన బాబుకు.. తన గురించి తాను ఎప్పుడు మాట్లాడుకోవాలో? ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలీదా? అన్నది అసలు ప్రశ్న. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎవరి గొప్పతనం గురించి వారు చెప్పుకుంటే బాగోదు. అందులోకి బాబు లాంటి వారికి అస్సలు సూట్ కాదు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగతే చూడండి. అబద్ధాల్ని సైతం ఎంత అందంగా చెబుతారో ఆయన దగ్గరే చూసి నేర్చుకోవాలి. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే. ఆ విషయంలో మారో మాటకు తావు లేదని చెప్పటమే కాదు.. తేడా వస్తే తన తల తెగుతుందే తప్పించి.. మాట తేడా అన్నది తన వంశంలోనే ఉండదన్న మాట మాట్లాడతారు. మరేం జరిగిందో అందరికి తెలుసు. మరి.. ఆ విషయాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. ఎవరైనా ఆ దుస్సాహసం చేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో సారుకు బాగా తెలుసు.
కానీ.. బాబుకు ఇలాంటి విషయాల మీద పట్టు తక్కువే. తన మనసుకు తోచింది చెప్పుసుకుంటూ పోవటమే. చివరకు తాను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసిన విషయాన్ని ఆయనే చెప్పుకోవాలే తప్పించి.. అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో నేతలెవరూ ప్రస్తావించరు. తనకున్న విజన్ గురించి బాబు చెప్పుకోవాల్సిన దుస్థితి. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయానికి వస్తే ఆయనకున్న దూరదృష్టి గురించి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తుంది.
ఏడేళ్ల క్రితం తాను చేసిన పాదయాత్ర ముగింపు గురించి.. ఆ సందర్భంగా తాను పడిన శ్రమ గురించి బాబే చెప్పుకోవాలే కానీ.. ఆయన విధేయులెవరూ ముందుకు రారు. ఎంతసేపటికి తన డప్పు తాను కొట్టుకోవటమే కానీ..సమయానికి అనుగుణంగా బాబు డప్పును తమ్ముళ్లు కొడితే బాగుంటుంది కదా?
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…