నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
దీంతో బాలయ్యతో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఎంత సంతోషంలో మునిగిపోయినా… బాలయ్యలోని స్పాంటేనిటీ మాత్రం నిత్యం ఆన్ లోనే ఉంటుందని ఆదివారం మరోమారు రుజుకు అయ్యింది.
పద్మ భూషణ్ దక్కిన వేళ… బాలయ్యను అభినందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నేరుగా బాలయ్య ఇంటికే వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి.. పద్మ భూషణ్ పురస్కారానికి మీరు నిజమైన అర్హులు అంటూ కీర్తించారు.
ఇక తనను అభినందించేందుకు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చిన నేపథ్యంలో బాలయ్య కూడా కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తన వంతుగా కేంద్రానికి ధన్యవాాదాలు తెలిపేలా కిషన్ రెడ్డికి ఆత్మీయ సత్కారం చేశారు.
అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వచ్చిన క్రమంలో అక్కడే ఉన్న మీడియాతో బాలయ్య కాసేపు ముచ్చటించారు. ఈ పందర్భంగా తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ను బాలయ్య ప్రస్తావించారు.
కిషన్ రెడ్డి సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించిన బాలయ్య… ఇదేదో తన ఒక్కడిదో, తన అబిమానుల డిమాండో కాదని చెప్పారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్నది ప్రతి తెలుగోడి కోరిక అని చెప్పారు. త్వరలోనే వారందరి కోరిక తీరుతుందని ఆశిస్తున్నా అంటూ బాలయ్య అన్నారు.
ఇలా బాలయ్య.. ఎన్టీఆర్ కు భారత రత్న గురించి మాట్లాడుతున్నంత సేపు కిషన్ రెడ్డి ఏదో తన్మయత్వంలో ఉన్నట్లుగా కనిపించారు. బాలయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాటకూ సరేనన్నట్లుగా తల ఊపుతూ సాగిన కిషన్ రెడ్డి… తన మోముపై చిరునవ్వును చెరగనీయలేదు. కిషన్ రెడ్డిలోని ఈ తన్మయత్వాన్ని చూస్తుంటే… ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కూడా బలంగానే కోరుకుంటున్నట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 26, 2025 9:39 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…