నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
దీంతో బాలయ్యతో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఎంత సంతోషంలో మునిగిపోయినా… బాలయ్యలోని స్పాంటేనిటీ మాత్రం నిత్యం ఆన్ లోనే ఉంటుందని ఆదివారం మరోమారు రుజుకు అయ్యింది.
పద్మ భూషణ్ దక్కిన వేళ… బాలయ్యను అభినందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నేరుగా బాలయ్య ఇంటికే వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి.. పద్మ భూషణ్ పురస్కారానికి మీరు నిజమైన అర్హులు అంటూ కీర్తించారు.
ఇక తనను అభినందించేందుకు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చిన నేపథ్యంలో బాలయ్య కూడా కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తన వంతుగా కేంద్రానికి ధన్యవాాదాలు తెలిపేలా కిషన్ రెడ్డికి ఆత్మీయ సత్కారం చేశారు.
అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వచ్చిన క్రమంలో అక్కడే ఉన్న మీడియాతో బాలయ్య కాసేపు ముచ్చటించారు. ఈ పందర్భంగా తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ను బాలయ్య ప్రస్తావించారు.
కిషన్ రెడ్డి సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించిన బాలయ్య… ఇదేదో తన ఒక్కడిదో, తన అబిమానుల డిమాండో కాదని చెప్పారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్నది ప్రతి తెలుగోడి కోరిక అని చెప్పారు. త్వరలోనే వారందరి కోరిక తీరుతుందని ఆశిస్తున్నా అంటూ బాలయ్య అన్నారు.
ఇలా బాలయ్య.. ఎన్టీఆర్ కు భారత రత్న గురించి మాట్లాడుతున్నంత సేపు కిషన్ రెడ్డి ఏదో తన్మయత్వంలో ఉన్నట్లుగా కనిపించారు. బాలయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాటకూ సరేనన్నట్లుగా తల ఊపుతూ సాగిన కిషన్ రెడ్డి… తన మోముపై చిరునవ్వును చెరగనీయలేదు. కిషన్ రెడ్డిలోని ఈ తన్మయత్వాన్ని చూస్తుంటే… ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కూడా బలంగానే కోరుకుంటున్నట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 26, 2025 9:39 pm
చిన్న, పెద్ద అని తేడా లేకుండా దురంధర్, దురంధర్-2 చిత్రాల్లో నటించిన ప్రతి ఆర్టిస్టూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ…
గత ఏడాది ‘దండోరా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు…
పై ఫొటో ఎంత దారుణంగా ఉందో చూశారుగా!. రోడ్డు ప్రమాదాలకే ఇది పరాకాష్ట అని అధికారులు తెలిపారు. తమ ప్రమేయం…
ఎంతలా ప్రచారం చేసినా.. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ఎంతలా ప్రయత్నించినా.. నిత్యం కొన్ని వేల మంది మోసపోతున్న పరిస్థితి.…
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ.. వడివడిగా పరుగులు పెడుతోంది. ప్రజలను మచ్చిక చేసుకునే…
కొందరు దర్శకులు రియాలిటీలో ఉండరు. తమ సినిమా పోయిందని తెలిసినా, డిజాస్టరని ప్రేక్షకులు తేల్చేసినా కూడా ఆ నిజాన్ని ఒప్పుకోరు.…