Political News

జగన్ ప్లాన్ తో విజయసాయి రాజీనామా: షర్మిల

వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే వైసీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్లు చేశారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని విమర్శించారు.

జగన్ అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి రాజీనామా చేయరని, ఆయన పార్టీని వీడడం చిన్న విషయం కాదని అన్నారు. విజయసాయిరెడ్డిని జగన్ పక్కా ప్లాన్ తో బీజేపీలోకి పంపుతున్నారని షర్మిల ఆరోపించారు. విజయసాయి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు నిజాలేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా జగన్‌ ను వదిలి వెళ్లిపోతున్నారని షర్మిల అన్నారు.

బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని, బీజేపీ దగ్గర విజయసాయిని ఉంచి కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్ చెప్పమన్న అబద్దాలు విజయసాయి చెప్పారని, ఇప్పటికైనా ఆయన నిజాలు చెబితే ప్రజలు హర్షిస్తారని అన్నారు. తన కుటుంబంపై, తనపై, తన పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా విజయసాయి విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు.

This post was last modified on January 26, 2025 10:08 am

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

45 minutes ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

1 hour ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

3 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

5 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

9 hours ago