వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే వైసీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్లు చేశారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని విమర్శించారు.
జగన్ అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి రాజీనామా చేయరని, ఆయన పార్టీని వీడడం చిన్న విషయం కాదని అన్నారు. విజయసాయిరెడ్డిని జగన్ పక్కా ప్లాన్ తో బీజేపీలోకి పంపుతున్నారని షర్మిల ఆరోపించారు. విజయసాయి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు నిజాలేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా జగన్ ను వదిలి వెళ్లిపోతున్నారని షర్మిల అన్నారు.
బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని, బీజేపీ దగ్గర విజయసాయిని ఉంచి కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్ చెప్పమన్న అబద్దాలు విజయసాయి చెప్పారని, ఇప్పటికైనా ఆయన నిజాలు చెబితే ప్రజలు హర్షిస్తారని అన్నారు. తన కుటుంబంపై, తనపై, తన పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా విజయసాయి విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు…
రోజుకు 8 గంటలకు మించి పని చేయనంటూ ఈ మధ్య దీపిక పదుకొనే ఫిలిం మేకర్స్కు కండిషన్ పెట్టడం ఎంత…
నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో…
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి…
దురంధర్ రాకముందు స్పై యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా…