రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు. వచ్చీ రాగానే… కార్యరంగంలోకి దిగిపోయిన చంద్రబాబు… శుక్రవారం సాయంత్రమే ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆయన పేర్కొన్నారు. తాను అనుకున్న దానిని దిగ్విజయంగానే పూర్తి చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అవకాశాలను పెట్టుబడిదారుల ముందు ఉంచానని తెలిపారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల ప్రముఖులతో సమావేశమైనట్లు తెలిపారు.
ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావదానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.
వెరసి రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రప్పించడం అనే కీలకమైన బాధ్యతను తాను నెరవేర్చానని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. తమ కృషి వల్ల రాష్ట్రానికి వస్తున్న దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రానికి వచ్చే ఏ ొక్క దిగ్గజ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా వెనక్కు వెళ్లడానికి వీల్లేని దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
This post was last modified on January 25, 2025 6:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…