“ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!”- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రెండు మూడు రోజుల కిందట ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిగ్వి జయ్కు తెలుగు రాష్ట్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇక్కడ ఇంచార్జ్గా పనిచేశారు. సో.. ఆయనకు సరైన అవగానే ఉంది. కాబట్టి ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇలా ఎందుకు?
వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి ముందు వరకు.. ఏపీ కాంగ్రెస్ వేరు. తర్వాత పరిస్థితి వేరు. అప్పటి వరకు ఉన్న నాయకత్వాన్ని పక్కన పెట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెకు పగ్గాలు అప్పగించిన తర్వాత.. పార్టీ పరిస్థితి మలుపు తిరుగుతుందని, ఇక, తిరుగు లేదని ఒక సంకేతం అయితే వచ్చింది. సరిగ్గా ఎన్నికలకు రెండు మాసాల ముందు షర్మిల పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయినా.. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆమె గెలిపించుకోలేక పోయారు. కనీసం తను డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు.
అప్పట్లో అంటే.. ఎన్నికలకు ముందు సమయం సరిపోలేదన్న వాదన షర్మిల అనుచరులు, ఆమెను సపోర్టు చేసేవారు చెప్పుకొచ్చారు. కేవలం రెండు మాసాల్లోనే ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ, ఎన్నికల అనంతరం.. పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? అనేది ప్రశ్న. వాస్తవానికి షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి.. మరో రెండుమూడు వారాల్లో ఏడాది పూర్తవుతోంది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీనికి రీజనేంటనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఆమె ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నది.. కొందరు చెబుతున్న వాదన అయితే.. అసలు షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు.. గత మూడు నాలుగు మాసాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది కూడా.. తెలుస్తోంది. ఈ పరిణామాలకు తోడు నిజంగానే షర్మిల సొంత అజెండాను అమలు చేయడం కూడా పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. కేవలం జగన్ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారన్న మచ్చ ఆమెపై పడింది. ఇదే.. ఇప్పుడు కేంద్రం స్థాయిలోనూ సీనియర్లను పెదవి విరిచేలా చేస్తుండడం గమనార్హం.
This post was last modified on January 24, 2025 7:09 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…