“ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!”- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రెండు మూడు రోజుల కిందట ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిగ్వి జయ్కు తెలుగు రాష్ట్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇక్కడ ఇంచార్జ్గా పనిచేశారు. సో.. ఆయనకు సరైన అవగానే ఉంది. కాబట్టి ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇలా ఎందుకు?
వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి ముందు వరకు.. ఏపీ కాంగ్రెస్ వేరు. తర్వాత పరిస్థితి వేరు. అప్పటి వరకు ఉన్న నాయకత్వాన్ని పక్కన పెట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెకు పగ్గాలు అప్పగించిన తర్వాత.. పార్టీ పరిస్థితి మలుపు తిరుగుతుందని, ఇక, తిరుగు లేదని ఒక సంకేతం అయితే వచ్చింది. సరిగ్గా ఎన్నికలకు రెండు మాసాల ముందు షర్మిల పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయినా.. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆమె గెలిపించుకోలేక పోయారు. కనీసం తను డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు.
అప్పట్లో అంటే.. ఎన్నికలకు ముందు సమయం సరిపోలేదన్న వాదన షర్మిల అనుచరులు, ఆమెను సపోర్టు చేసేవారు చెప్పుకొచ్చారు. కేవలం రెండు మాసాల్లోనే ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ, ఎన్నికల అనంతరం.. పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? అనేది ప్రశ్న. వాస్తవానికి షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి.. మరో రెండుమూడు వారాల్లో ఏడాది పూర్తవుతోంది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీనికి రీజనేంటనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఆమె ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నది.. కొందరు చెబుతున్న వాదన అయితే.. అసలు షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు.. గత మూడు నాలుగు మాసాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది కూడా.. తెలుస్తోంది. ఈ పరిణామాలకు తోడు నిజంగానే షర్మిల సొంత అజెండాను అమలు చేయడం కూడా పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. కేవలం జగన్ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారన్న మచ్చ ఆమెపై పడింది. ఇదే.. ఇప్పుడు కేంద్రం స్థాయిలోనూ సీనియర్లను పెదవి విరిచేలా చేస్తుండడం గమనార్హం.
This post was last modified on January 24, 2025 7:09 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…