ఏపీ సర్కారు తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు దావోస్లో పెట్టుబడులు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో వారి శ్రమను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయలేం. కానీ, కొన్ని అనివార్య కారణాలతో అనుకున్న విధంగా తక్షణ ఫలితం అయితే దక్కలేదన్నది వాస్తవం. దీనికి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ, ఈ చర్చలు, ఒప్పందాల ఫలితాలు, ఫలాలు కూడా వచ్చే ఆరు మాసాల్లో కనిపిస్తాయని అంటున్నారు పరిశీలకులు. ఏఐ యూనివర్సిటీకి సహకారం సహా.. ఐటీ రంగంలో సహకారం విషయంలో బిల్ గేట్స్ సూత్ర ప్రాయంగా అంగీకరించారు.
అదేవిధంగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ వంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. అదేవిధంగా టైర్ల కంపెనీలు, మాన్యుఫ్యాక్చర్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరచాయి. కానీ, ఇప్పటికిప్పుడు కుదిరింది.. కేవలం 15 వేల కోట్ల ఒప్పందాలు మాత్రమే. దీంతో ఇది ఇబ్బందికర వాతావరణమనే చెప్పాలి. అయితే.. వచ్చే ఆరు మాసాల్లో మాత్రం వీటి తాలుకూ ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీనే కారణమా?
తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీకి పెట్టుబడులు తగ్గాయన్నది వాస్తవం. ఈ విషయాన్ని రాజకీయంగా కూటమి నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో ఒప్పుకొంటున్నారు. అయితే.. దీనికికారణం.. వైసీపీనే అని చెబుతున్నారు. గత ఐదేళ్లలో రాజధాని నగరం అమరావతిని వైసీపీ పూర్తి చేసి ఉన్నా.. కనీసం సగమైనా నిర్మాణాలు పూర్తి చేసి ఉన్నా.. పెట్టుబడి పెట్టేవారు.. వచ్చేందుకు ఉత్సాహం చూపించే వారని అంటున్నారు. కానీ, ఇప్పుడే నిర్మాణాలు పుంజుకుంటున్న క్రమంలో ఇవి ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు.
సాధారణంగా.. ఏ పెట్టుబడి దారుడైనా.. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్నే ఎంచుకుంటారు. కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయిన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు.. సిద్ధపడ్డారన్న వాదనా వినిపిస్తోంది. అయితే.. ఏపీ ఆశలు సన్నగిల్లలేదని.. త్వరలోనే పెట్టుబడి దారులు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నాయకుడు, గతంలో ఆర్థిక వ్యవహారాలు చూసిన నేత ఒకరు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 24, 2025 3:41 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…