Political News

‘ప‌ర్య‌ట‌న’ ఫ‌లితం.. ఆరు మాసాల త‌ర్వాతే!

ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు దావోస్‌లో పెట్టుబ‌డులు దూసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంలో వారి శ్ర‌మ‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేం. కానీ, కొన్ని అనివార్య కార‌ణాల‌తో అనుకున్న విధంగా త‌క్ష‌ణ ఫ‌లితం అయితే ద‌క్క‌లేద‌న్న‌ది వాస్త‌వం. దీనికి ప‌లు కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి. కానీ, ఈ చ‌ర్చ‌లు, ఒప్పందాల ఫ‌లితాలు, ఫ‌లాలు కూడా వ‌చ్చే ఆరు మాసాల్లో క‌నిపిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏఐ యూనివ‌ర్సిటీకి స‌హ‌కారం స‌హా.. ఐటీ రంగంలో స‌హ‌కారం విష‌యంలో బిల్ గేట్స్ సూత్ర ప్రాయంగా అంగీక‌రించారు.

అదేవిధంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు గూగుల్ వంటి సంస్థ‌లు కూడా ముందుకు వ‌చ్చాయి. అదేవిధంగా టైర్ల కంపెనీలు, మాన్యుఫ్యాక్చ‌ర్ యూనిట్ల‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చాయి. కానీ, ఇప్ప‌టికిప్పుడు కుదిరింది.. కేవలం 15 వేల కోట్ల ఒప్పందాలు మాత్ర‌మే. దీంతో ఇది ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ‌మ‌నే చెప్పాలి. అయితే.. వ‌చ్చే ఆరు మాసాల్లో మాత్రం వీటి తాలుకూ ఫ‌లితాలు క‌నిపిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీనే కార‌ణ‌మా?

తెలంగాణ‌తో పోల్చుకుంటే.. ఏపీకి పెట్టుబ‌డులు తగ్గాయ‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా కూట‌మి నేత‌లు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఒప్పుకొంటున్నారు. అయితే.. దీనికికార‌ణం.. వైసీపీనే అని చెబుతున్నారు. గ‌త ఐదేళ్ల‌లో రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిని వైసీపీ పూర్తి చేసి ఉన్నా.. క‌నీసం స‌గ‌మైనా నిర్మాణాలు పూర్తి చేసి ఉన్నా.. పెట్టుబ‌డి పెట్టేవారు.. వ‌చ్చేందుకు ఉత్సాహం చూపించే వార‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడే నిర్మాణాలు పుంజుకుంటున్న క్ర‌మంలో ఇవి ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా.. ఏ పెట్టుబ‌డి దారుడైనా.. త‌న‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్నే ఎంచుకుంటారు. కాబ‌ట్టి అన్ని విధాలా డెవ‌ల‌ప్ అయిన హైద‌రాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు.. సిద్ధ‌ప‌డ్డార‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయితే.. ఏపీ ఆశ‌లు స‌న్న‌గిల్ల‌లేద‌ని.. త్వ‌ర‌లోనే పెట్టుబ‌డి దారులు ఒప్పందాలు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ ముఖ్య నాయ‌కుడు, గ‌తంలో ఆర్థిక వ్య‌వ‌హారాలు చూసిన నేత‌ ఒక‌రు వ్యాఖ్యానించారు.

This post was last modified on January 24, 2025 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago