Political News

సుబ్బారాయుడు ఫస్ట్ పంచ్ అదిరిపోయిందిగా!!

ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే… సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని వస్తామంటూ జగన్ పవర్ పంచ్ డైలాగ్ సంధించారు.

ఇక ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన సమయంలోనూ సుబ్బారాయుడు ప్రస్తావన బాగానే వినిపించింది. తొక్కిసలాట సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీఎస్పీని సస్పెండ్ చేసిన చంద్రబాబు సర్కారు.. తనకు ఇష్టమైన సుబ్బారాయుడిని మాత్రం బదిలీతో సరిపెట్టిందని వైసీపీ విమర్శలు సంధించింది. అయితే ఈ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు… సుబ్బారాయుడును బదిలీ చేసి ఎక్కడికో శంకర గిరి మాన్యాలకు పంపకుండా… తిరుపతిలోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులు అయ్యారు.

ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాలో షెకావత్ మాదిరిగా… మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టేశారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.

సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది,. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని పట్టేసి… కంటెయినర్ ను ఓపెన్ చేయగా… రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఇంకేముంది… కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం… పట్టుబడ్డ స్మగ్లర్లను అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కి పంపింది.

This post was last modified on January 24, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

13 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

34 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago