Political News

సుబ్బారాయుడు ఫస్ట్ పంచ్ అదిరిపోయిందిగా!!

ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే… సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని వస్తామంటూ జగన్ పవర్ పంచ్ డైలాగ్ సంధించారు.

ఇక ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన సమయంలోనూ సుబ్బారాయుడు ప్రస్తావన బాగానే వినిపించింది. తొక్కిసలాట సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీఎస్పీని సస్పెండ్ చేసిన చంద్రబాబు సర్కారు.. తనకు ఇష్టమైన సుబ్బారాయుడిని మాత్రం బదిలీతో సరిపెట్టిందని వైసీపీ విమర్శలు సంధించింది. అయితే ఈ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు… సుబ్బారాయుడును బదిలీ చేసి ఎక్కడికో శంకర గిరి మాన్యాలకు పంపకుండా… తిరుపతిలోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులు అయ్యారు.

ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాలో షెకావత్ మాదిరిగా… మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టేశారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.

సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది,. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని పట్టేసి… కంటెయినర్ ను ఓపెన్ చేయగా… రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఇంకేముంది… కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం… పట్టుబడ్డ స్మగ్లర్లను అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కి పంపింది.

This post was last modified on January 24, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

17 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

21 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

28 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

39 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

1 hour ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

2 hours ago