Political News

సుబ్బారాయుడు ఫస్ట్ పంచ్ అదిరిపోయిందిగా!!

ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే… సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని వస్తామంటూ జగన్ పవర్ పంచ్ డైలాగ్ సంధించారు.

ఇక ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన సమయంలోనూ సుబ్బారాయుడు ప్రస్తావన బాగానే వినిపించింది. తొక్కిసలాట సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీఎస్పీని సస్పెండ్ చేసిన చంద్రబాబు సర్కారు.. తనకు ఇష్టమైన సుబ్బారాయుడిని మాత్రం బదిలీతో సరిపెట్టిందని వైసీపీ విమర్శలు సంధించింది. అయితే ఈ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు… సుబ్బారాయుడును బదిలీ చేసి ఎక్కడికో శంకర గిరి మాన్యాలకు పంపకుండా… తిరుపతిలోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులు అయ్యారు.

ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాలో షెకావత్ మాదిరిగా… మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టేశారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.

సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది,. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని పట్టేసి… కంటెయినర్ ను ఓపెన్ చేయగా… రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఇంకేముంది… కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం… పట్టుబడ్డ స్మగ్లర్లను అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కి పంపింది.

This post was last modified on January 24, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago