టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు చేస్తే చర్యలు తప్పవని ఒకింత గట్టిగానే చెప్పింది. ఫలితంగా సైలెన్స్ రాజ్యమేలుతోంది.
అయితే సరిగ్గా లోకేశ్ జన్మదినమైన గురువారం పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు… లోకేశ్ పదోన్నతిని ప్రస్తావించారు. లోకేశ్ బర్త్ డేను పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భరత్ తో కలిసి భారీ కేక్ ను కట్ చేసిన అచ్చెన్న… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేశేనని చెబుతానని అన్నారు. ఈ మాటను తానే కాదు రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారని కూడా ఆయన అన్నారు. లోకేశ్ తమ భవిష్యత్తు నేత అని అచ్చెన్న ఒకింత గట్టిగానే చెప్పారు.
అధిష్ఠానాన్ని ధిక్కరించి లోకేశే తమ భావి నేత అని చెప్పిన అచ్చెన్న.. తన వ్యాఖ్యలను భలే బ్యాలెన్స్ చేసుకున్నారు. గతంలో పార్టీ ఏపీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా అచ్చెన్న పనిచేశారు కదా. ఆ అనుభవంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ తప్పువట్టకుండా ఉండేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేశే తమ భవిష్యత్తు నేత అయినా… పొత్తు ధర్మాన్ని పాటించి… కూటమి పార్టీల్లోని ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను కూడా కూటమి నేతల మాటలకు కట్టుబడి ఉంటానని కూడా అచ్చెన్న చెప్పేసి… తన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మరొకరు లోకేశ్ కు డిప్యూటీ డిమాండ్లు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
This post was last modified on January 23, 2025 5:28 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…