టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు చేస్తే చర్యలు తప్పవని ఒకింత గట్టిగానే చెప్పింది. ఫలితంగా సైలెన్స్ రాజ్యమేలుతోంది.
అయితే సరిగ్గా లోకేశ్ జన్మదినమైన గురువారం పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు… లోకేశ్ పదోన్నతిని ప్రస్తావించారు. లోకేశ్ బర్త్ డేను పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భరత్ తో కలిసి భారీ కేక్ ను కట్ చేసిన అచ్చెన్న… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేశేనని చెబుతానని అన్నారు. ఈ మాటను తానే కాదు రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారని కూడా ఆయన అన్నారు. లోకేశ్ తమ భవిష్యత్తు నేత అని అచ్చెన్న ఒకింత గట్టిగానే చెప్పారు.
అధిష్ఠానాన్ని ధిక్కరించి లోకేశే తమ భావి నేత అని చెప్పిన అచ్చెన్న.. తన వ్యాఖ్యలను భలే బ్యాలెన్స్ చేసుకున్నారు. గతంలో పార్టీ ఏపీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా అచ్చెన్న పనిచేశారు కదా. ఆ అనుభవంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ తప్పువట్టకుండా ఉండేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేశే తమ భవిష్యత్తు నేత అయినా… పొత్తు ధర్మాన్ని పాటించి… కూటమి పార్టీల్లోని ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను కూడా కూటమి నేతల మాటలకు కట్టుబడి ఉంటానని కూడా అచ్చెన్న చెప్పేసి… తన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మరొకరు లోకేశ్ కు డిప్యూటీ డిమాండ్లు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
This post was last modified on January 23, 2025 5:28 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…