టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు చేస్తే చర్యలు తప్పవని ఒకింత గట్టిగానే చెప్పింది. ఫలితంగా సైలెన్స్ రాజ్యమేలుతోంది.
అయితే సరిగ్గా లోకేశ్ జన్మదినమైన గురువారం పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు… లోకేశ్ పదోన్నతిని ప్రస్తావించారు. లోకేశ్ బర్త్ డేను పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భరత్ తో కలిసి భారీ కేక్ ను కట్ చేసిన అచ్చెన్న… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేశేనని చెబుతానని అన్నారు. ఈ మాటను తానే కాదు రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారని కూడా ఆయన అన్నారు. లోకేశ్ తమ భవిష్యత్తు నేత అని అచ్చెన్న ఒకింత గట్టిగానే చెప్పారు.
అధిష్ఠానాన్ని ధిక్కరించి లోకేశే తమ భావి నేత అని చెప్పిన అచ్చెన్న.. తన వ్యాఖ్యలను భలే బ్యాలెన్స్ చేసుకున్నారు. గతంలో పార్టీ ఏపీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా అచ్చెన్న పనిచేశారు కదా. ఆ అనుభవంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ తప్పువట్టకుండా ఉండేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేశే తమ భవిష్యత్తు నేత అయినా… పొత్తు ధర్మాన్ని పాటించి… కూటమి పార్టీల్లోని ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను కూడా కూటమి నేతల మాటలకు కట్టుబడి ఉంటానని కూడా అచ్చెన్న చెప్పేసి… తన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మరొకరు లోకేశ్ కు డిప్యూటీ డిమాండ్లు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
This post was last modified on January 23, 2025 5:28 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…