టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు చేస్తే చర్యలు తప్పవని ఒకింత గట్టిగానే చెప్పింది. ఫలితంగా సైలెన్స్ రాజ్యమేలుతోంది.
అయితే సరిగ్గా లోకేశ్ జన్మదినమైన గురువారం పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు… లోకేశ్ పదోన్నతిని ప్రస్తావించారు. లోకేశ్ బర్త్ డేను పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భరత్ తో కలిసి భారీ కేక్ ను కట్ చేసిన అచ్చెన్న… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేశేనని చెబుతానని అన్నారు. ఈ మాటను తానే కాదు రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారని కూడా ఆయన అన్నారు. లోకేశ్ తమ భవిష్యత్తు నేత అని అచ్చెన్న ఒకింత గట్టిగానే చెప్పారు.
అధిష్ఠానాన్ని ధిక్కరించి లోకేశే తమ భావి నేత అని చెప్పిన అచ్చెన్న.. తన వ్యాఖ్యలను భలే బ్యాలెన్స్ చేసుకున్నారు. గతంలో పార్టీ ఏపీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా అచ్చెన్న పనిచేశారు కదా. ఆ అనుభవంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ తప్పువట్టకుండా ఉండేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేశే తమ భవిష్యత్తు నేత అయినా… పొత్తు ధర్మాన్ని పాటించి… కూటమి పార్టీల్లోని ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను కూడా కూటమి నేతల మాటలకు కట్టుబడి ఉంటానని కూడా అచ్చెన్న చెప్పేసి… తన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మరొకరు లోకేశ్ కు డిప్యూటీ డిమాండ్లు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
This post was last modified on January 23, 2025 5:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…