ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. భారత కాల మానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో స్విట్జర్లాండ్ లోని దావోస్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏపీకి, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేకం కావడం విశేషం. ఈ క్రమంలో బిల్ గేట్స్తో తనకు పూర్వమే ఉన్న పరిచయాలను చంద్రబాబు పంచుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసిన విధానాలను ఆయనకు మరోసారి గుర్తు చేశారు.
హైదరాబాద్లో 1995-97 మధ్య మైక్రోసాఫ్ట్ను తీసుకురావడం.. ఈక్రమంలో అమెరికాలో గేట్స్ కోసం వేచి ఉన్న సమయం.. కేవలం పదినిమిషాల పాటు సమయం ఇచ్చి.. దాదాపు గంట సేపు చర్చించుకున్న సందర్భం వంటివి చంద్రబాబు ఈ సందర్భం గా గత ఫొటోలను కూడా చూపించి వివరించారు. గేట్స్తో తనకు ఉన్న పరిచయం.. వ్యక్తిగతం కాదని.. అది దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన పరిచయమని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇక, తాజా భేటీలో గేట్స్ను ఏపీకి ఆహ్వానించారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలను కూడా ఆయన వివరించారు.
సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న తన వ్యూహాన్ని కూడా నిర్దేశించారు. ఈ క్రమంలోఏపీకి వచ్చి.. తమకు సలహాలు ఇవ్వాలని.. తమను నడిపించాలని కూడా సీఎం చంద్రబాబు గేట్స్ను కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలో తొలిసారిగా కృత్రిమ మేథ(ఏఐ) విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. దీనికి సలహాలు ఇవ్వాలని గేట్స్ను కోరారు. శర వేగంతో అభివృద్ధి చెందుతున్న ఏపీ ఐటీ పరిశ్రమకు కూడా గేట్స్ తన అమూల్యమైన సలహాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఇక, ఇదే విషయాన్ని చంద్రబాబు ట్వీట్ రూపంలోనూ ప్రజలతో పంచుకున్నారు. బిల్ గేట్స్-చంద్రబాబులు దావోస్లో భేటీ అయిన ఫొటోను షేర్ చేసిన ఆయన 1995-2025 మధ్య తమ సంబంధాన్ని.. గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. అనేక సంవత్సరాల తర్వాత.. తాము కలుసుకున్నామని.. ఇది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఫొటోలో ఏపీకి సంబందించిన పలు విషయాలను లిఖిత పూర్వకంగా బిల్ గేట్స్కు వివరిస్తున్నట్టు ఉండడం గమనార్హం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…