విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ అనేక రాజకీయాలు సాగాయి. వైసీపీ అధినేత జగన్ సైతం ఆయన కనుసన్నల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వరూపానందేంద్రకు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. తిరుమలలో ఆయనకు వైసీపీ హయాంలో కేటాయించి భూమి విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని నిరూపితమైందని తెలిపింది.
ఈ క్రమంలో ఆయా భవనాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అంతే కాదు.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచేలా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేయడం మరింత సంచలనంగా మారింది. తిరుమలలో గోగర్భం డ్యామ్కు నష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించారన్న ప్రభుత్వవాదనతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని కూడా శారదాపీఠం నిర్వాహకుల తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్రమించేసే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుమలలో శారదా పీఠం కోసం.. గోగర్భం డ్యామ్కు సమీపంలో భూములు కేటాయించారు. అక్కడ వేద పాఠశాలతోపాటు.. ఉచిత వైద్య శాలను నిర్మించేందుకు అనుమతులు తీసుకున్నారు. దీనికి అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమతులు ఇచ్చింది. అనంతరం.. నిర్మాణాలు ప్రారంభమ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థలం కంటే ఎక్కువగా భూమిని ఆక్రమించి నిర్మాణాలు సాగించారని, నిబంధనలను కూడా తోసిపుచ్చారని పేర్కొంటూ.. అప్పట్లోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాలను నిలుపుదల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. తప్పులు జరిగాయని పేర్కొంది. దీనిపై లోతైన పరిశీలన జరుగుతోందని వివరించింది. తాజాగా బుధవారం నాటి విచారణలో ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. శారదాపీఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది.
సెలబ్రెటీలు స్టేజ్ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండడం ఎంతో అవసరం. ఈ సోషల్…
పొరపాట్లు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అదే పనిగా రిపీట్ చేస్తే దాన్ని తప్పు అంటారు. బాలీవుడ్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి…
సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు…
లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు…
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేసమయంలో ప్రభుత్వంపైనా…