విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ అనేక రాజకీయాలు సాగాయి. వైసీపీ అధినేత జగన్ సైతం ఆయన కనుసన్నల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వరూపానందేంద్రకు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. తిరుమలలో ఆయనకు వైసీపీ హయాంలో కేటాయించి భూమి విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని నిరూపితమైందని తెలిపింది.
ఈ క్రమంలో ఆయా భవనాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అంతే కాదు.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచేలా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేయడం మరింత సంచలనంగా మారింది. తిరుమలలో గోగర్భం డ్యామ్కు నష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించారన్న ప్రభుత్వవాదనతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని కూడా శారదాపీఠం నిర్వాహకుల తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్రమించేసే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుమలలో శారదా పీఠం కోసం.. గోగర్భం డ్యామ్కు సమీపంలో భూములు కేటాయించారు. అక్కడ వేద పాఠశాలతోపాటు.. ఉచిత వైద్య శాలను నిర్మించేందుకు అనుమతులు తీసుకున్నారు. దీనికి అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమతులు ఇచ్చింది. అనంతరం.. నిర్మాణాలు ప్రారంభమ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థలం కంటే ఎక్కువగా భూమిని ఆక్రమించి నిర్మాణాలు సాగించారని, నిబంధనలను కూడా తోసిపుచ్చారని పేర్కొంటూ.. అప్పట్లోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాలను నిలుపుదల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. తప్పులు జరిగాయని పేర్కొంది. దీనిపై లోతైన పరిశీలన జరుగుతోందని వివరించింది. తాజాగా బుధవారం నాటి విచారణలో ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. శారదాపీఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 8:37 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…