Political News

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ అనేక రాజ‌కీయాలు సాగాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారన్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వ‌రూపానందేంద్ర‌కు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ త‌గిలింది. తిరుమ‌ల‌లో ఆయ‌న‌కు వైసీపీ హ‌యాంలో కేటాయించి భూమి విష‌యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాలు జ‌రిగాయ‌ని నిరూపిత‌మైంద‌ని తెలిపింది.

ఈ క్ర‌మంలో ఆయా భ‌వ‌నాల‌ను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామ‌ని హైకోర్టు హెచ్చ‌రించింది. అంతే కాదు.. అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేప‌ట్టేవారికి ఈ ఘ‌ట‌న ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచేలా తీర్పు ఇస్తామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్‌కు న‌ష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించార‌న్న ప్ర‌భుత్వ‌వాద‌న‌తో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్‌, అనుమ‌తుల‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేప‌డ‌తారని కూడా శార‌దాపీఠం నిర్వాహ‌కుల త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. అనుమ‌తులు లేకుండా చేప‌ట్టే నిర్మాణాల‌ను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్ర‌మించేసే ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల‌లో శార‌దా పీఠం కోసం.. గోగ‌ర్భం డ్యామ్‌కు స‌మీపంలో భూములు కేటాయించారు. అక్క‌డ వేద పాఠ‌శాల‌తోపాటు.. ఉచిత‌ వైద్య శాల‌ను నిర్మించేందుకు అనుమ‌తులు తీసుకున్నారు. దీనికి అప్ప‌టి టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమ‌తులు ఇచ్చింది. అనంత‌రం.. నిర్మాణాలు ప్రారంభ‌మ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థ‌లం కంటే ఎక్కువ‌గా భూమిని ఆక్ర‌మించి నిర్మాణాలు సాగించార‌ని, నిబంధ‌న‌ల‌ను కూడా తోసిపుచ్చార‌ని పేర్కొంటూ.. అప్ప‌ట్లోనే బీజేపీ నాయ‌కులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

ఈ క్ర‌మంలో తిరుక్షేత్రాల ర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ లాయ‌ర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై గ‌తంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాల‌ను నిలుపుద‌ల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. అనంత‌రం.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక స‌మ‌ర్పించింది. త‌ప్పులు జ‌రిగాయ‌ని పేర్కొంది. దీనిపై లోతైన ప‌రిశీల‌న జ‌రుగుతోంద‌ని వివ‌రించింది. తాజాగా బుధ‌వారం నాటి విచార‌ణ‌లో ఆ నివేదిక‌ను ప‌రిశీలించిన హైకోర్టు.. శార‌దాపీఠంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. అఫిడ‌విట్ దాఖ‌లుకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

1 hour ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

8 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

9 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

9 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

11 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 hours ago