విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ అనేక రాజకీయాలు సాగాయి. వైసీపీ అధినేత జగన్ సైతం ఆయన కనుసన్నల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వరూపానందేంద్రకు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. తిరుమలలో ఆయనకు వైసీపీ హయాంలో కేటాయించి భూమి విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని నిరూపితమైందని తెలిపింది.
ఈ క్రమంలో ఆయా భవనాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అంతే కాదు.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచేలా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేయడం మరింత సంచలనంగా మారింది. తిరుమలలో గోగర్భం డ్యామ్కు నష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించారన్న ప్రభుత్వవాదనతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని కూడా శారదాపీఠం నిర్వాహకుల తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్రమించేసే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుమలలో శారదా పీఠం కోసం.. గోగర్భం డ్యామ్కు సమీపంలో భూములు కేటాయించారు. అక్కడ వేద పాఠశాలతోపాటు.. ఉచిత వైద్య శాలను నిర్మించేందుకు అనుమతులు తీసుకున్నారు. దీనికి అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమతులు ఇచ్చింది. అనంతరం.. నిర్మాణాలు ప్రారంభమ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థలం కంటే ఎక్కువగా భూమిని ఆక్రమించి నిర్మాణాలు సాగించారని, నిబంధనలను కూడా తోసిపుచ్చారని పేర్కొంటూ.. అప్పట్లోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాలను నిలుపుదల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. తప్పులు జరిగాయని పేర్కొంది. దీనిపై లోతైన పరిశీలన జరుగుతోందని వివరించింది. తాజాగా బుధవారం నాటి విచారణలో ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. శారదాపీఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 8:37 pm
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…