Political News

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ అనేక రాజ‌కీయాలు సాగాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారన్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వ‌రూపానందేంద్ర‌కు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ త‌గిలింది. తిరుమ‌ల‌లో ఆయ‌న‌కు వైసీపీ హ‌యాంలో కేటాయించి భూమి విష‌యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాలు జ‌రిగాయ‌ని నిరూపిత‌మైంద‌ని తెలిపింది.

ఈ క్ర‌మంలో ఆయా భ‌వ‌నాల‌ను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామ‌ని హైకోర్టు హెచ్చ‌రించింది. అంతే కాదు.. అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేప‌ట్టేవారికి ఈ ఘ‌ట‌న ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచేలా తీర్పు ఇస్తామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్‌కు న‌ష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించార‌న్న ప్ర‌భుత్వ‌వాద‌న‌తో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్‌, అనుమ‌తుల‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేప‌డ‌తారని కూడా శార‌దాపీఠం నిర్వాహ‌కుల త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. అనుమ‌తులు లేకుండా చేప‌ట్టే నిర్మాణాల‌ను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్ర‌మించేసే ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల‌లో శార‌దా పీఠం కోసం.. గోగ‌ర్భం డ్యామ్‌కు స‌మీపంలో భూములు కేటాయించారు. అక్క‌డ వేద పాఠ‌శాల‌తోపాటు.. ఉచిత‌ వైద్య శాల‌ను నిర్మించేందుకు అనుమ‌తులు తీసుకున్నారు. దీనికి అప్ప‌టి టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమ‌తులు ఇచ్చింది. అనంత‌రం.. నిర్మాణాలు ప్రారంభ‌మ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థ‌లం కంటే ఎక్కువ‌గా భూమిని ఆక్ర‌మించి నిర్మాణాలు సాగించార‌ని, నిబంధ‌న‌ల‌ను కూడా తోసిపుచ్చార‌ని పేర్కొంటూ.. అప్ప‌ట్లోనే బీజేపీ నాయ‌కులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

ఈ క్ర‌మంలో తిరుక్షేత్రాల ర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ లాయ‌ర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై గ‌తంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాల‌ను నిలుపుద‌ల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. అనంత‌రం.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక స‌మ‌ర్పించింది. త‌ప్పులు జ‌రిగాయ‌ని పేర్కొంది. దీనిపై లోతైన ప‌రిశీల‌న జ‌రుగుతోంద‌ని వివ‌రించింది. తాజాగా బుధ‌వారం నాటి విచార‌ణ‌లో ఆ నివేదిక‌ను ప‌రిశీలించిన హైకోర్టు.. శార‌దాపీఠంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. అఫిడ‌విట్ దాఖ‌లుకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

2 hours ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

5 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

9 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago