Political News

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. బుధ‌వారం ఈ మేర‌కు బీజేపీ నాయ‌క‌త్వానికి ముంబైలోని ఆర్ ఎస్ ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి లేఖ చేరిన‌ట్టు మ‌హా రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీలో అధికారం ద‌క్కించుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. కానీ, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో బీజేపీకి తీవ్ర ప్ర‌తిబంధకం ఎదుర‌వుతోంది.

ఈ క్ర‌మంలో తాము ఉచిత ప‌థ‌కాల‌కు వ్య‌తిరేక‌మైన‌ప్ప‌టికీ.. ఢిల్లీ రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకుని ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి రెండు మేనిఫెస్టోలు విడుద‌ల చేసిన క‌మ‌ల నాథులు ఢిల్లీ వాసుల‌పై లెక్క‌కు మిక్కిలిగా వ‌రాల జ‌ల్లు కురిపించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఆప్‌కు పోటీగా.. ‘కేజీ నుంచి పీజీ వరకూ ప్రభుత్వ సంస్థల్లో ఉచిత విద్య’ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ఉద్యోగ‌ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఢిల్లీ యువతకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

ఇక‌, ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా వెయ్యి రూపాయ‌ల‌ స్టైఫండ్ ఇస్తామ‌ని భారీ హామీ ఇచ్చారు. ఇక‌, మ‌హిళ‌ల‌కు నెల‌నెలా రూ.2500, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కొన‌సాగింపు, 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు… ఇలా లెక్క‌కు మిక్కిలిగా బీజేపీ వ‌రాలు కురిపిస్తోంది. అయితే.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. ఆర్ ఎస్ ఎస్‌.. ‘ఇక‌, చాలు ఆపండి’ అని పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాకు లేఖ సంధించార‌ని మ‌హారాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం.

“ఉచితాలకు మేం వ్య‌తిరేకం. కానీ, ఏదైనా పేద‌లు ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. పైగా దేశ రాజ‌ధానిలో ఉచితాల పేరుతో ప్ర‌పంచ దేశాల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. ఉచితాల పేరుతో ఓట్లు అడ‌గ‌డం ద్వారా.. మోడీ పాల‌న‌ను త‌క్కువ చేసి చూపుతున్నారా? లేక‌, ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో జ‌రిగిన అభివృద్ది, దేశ ఉన్న‌తి కంటే.. ఉచితాలే మంచిద‌ని భావిస్తున్నారా? అనేది ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. అది మ‌రింత ప్ర‌మాదక‌రం. అందుకే మా బాధ్య‌త‌గా మేం చెబుతున్నాం. త‌ర్వాత వారి ఇష్టం” అని ఆర్ ఎస్ ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 22, 2025 2:26 pm

Share

Recent Posts

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

1 hour ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

7 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

9 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

11 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

11 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

11 hours ago