Political News

ఎల్లో హెల్మెట్ తో బుల్లెట్ బండిపై బాలయ్య

నట సింహం నందమూరి బాలకృష్ణ… సినిమా నటుడే కాదు. ఏపీలో అధికార కూటమి సర్కారును నడుపుతున్న టీడీపీలో కీలక నేత, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేసిన ఎమ్మెల్యే. వెరసి సినీ నటుడిగానే కాకుండా హిందూపురం ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్న రాజకీయ నేత కూడా. మరి వారికోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే… తనకు వీలు చిక్కినప్పుడల్లా ఎంచక్కా.. హిందూపురంలో వాలిపోయే బాలయ్య నియోజకవర్గ పరిదిలో సుడిగాలి పర్యటన చేస్తుంటారు. అవసరమైన పనులకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ… అడిగిన వారికి కాదు, లేదు అనే సమాధానం రాకుండా చూసుకుంటూ ఉంటారు.

తాజాగా మంగళవారం కూడా ఆయన హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్బంగా రహదారి భద్రతపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులకు తనవంతు సహకారం అందించారు. అందులో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న రహదారి భద్రతా వారోత్సవాల్లో బాలయ్య ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తలకు హెల్మెట్ ధరించి…బుల్లెట్ బండి ఎక్కి… అలా రోడ్డుపై రైడ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా బైకులపై వెళుతున్న యువత ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిని చెప్పిన బాలయ్య… జీవితం అంటే అది కాదని, ఫ్యామిలీకి అండగా నిలవడమే జీవితం అని జీవిత పాఠం చెప్పారు.

బైకులపై హెల్మెట్లు లేకుండా ఝుమ్మంటూ దూసుకుపోతూ కేరింతలు కొట్టడం ఎంజాయిమెంట్ కాదని బాలయ్య చెప్పారు. ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అప్పుడే సురక్షిత ప్రయాణాలు సాధ్యమవుతాయని తెలిపారు. నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులకు సహకరించాలని కూడా బాలయ్య సూచించారు. ఆపై విజయ సంకేతం చూపుతూ బాలయ్య అలా సాగిపోయారు. ఈ సందర్భంగా పట్టణంలోని గురునాథ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు బాలయ్య బుల్టెట్ పై సాగిపోగా… ఆయన అభిమానులు కేరింతలు కొడుతూ ఆయన వెంట సాాగారు. ఈ సందర్భంగా బాలయ్య తన తలపై ఎల్లో కలర్ హెల్మెట్ ధరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బుల్లెట్ రైడింగ్ కు ముందు బాలయ్యే అడిగి మరీ హెల్మెట్ తీసుకోవడం గమనార్హం.

This post was last modified on January 21, 2025 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago