Political News

ట్రంప్ ప్రభావం: భారతీయులకు కొత్త సవాళ్లు?

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని బలంగా వినిపించారు. అమెరికా ప్రజల కోసం ప్రత్యేకంగా పని చేస్తానని, దేశం ప్రథమ స్థానంలో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ నినాదం గతంలో ట్రంప్ పాలనలో భారతదేశంతో పాటు పలు దేశాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు జన్మత పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం, అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలు పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాల్సిందే. ఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులకు ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

‘అమెరికా ఫస్ట్’ నినాదం కింద ట్రంప్ గతంలో భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయా వస్తువులపై సుంకాలు పెరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం, మెడిసెన్స్ వంటి పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.

అంతేకాకుండా, హెచ్1బి వీసాల విషయంలో కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతీయ ఐటీ ఉద్యోగులకు దెబ్బ తగలవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ మోదీ మధ్య గతంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కొనసాగితే, ఈ ప్రభావాన్ని కొంతమేర సానుకూలంగా మార్చగలమనే అంచనా ఉంది. 2025లో భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సుకు ట్రంప్ హాజరవుతారని సమాచారం. అమెరికాలోని 54 లక్షల మంది భారతీయులకు ఈ సరికొత్త నిర్ణయాలు ఏమేరకు అనుకూలంగా ఉంటాయో చూడాలి. మోదీ ప్రభుత్వం, ట్రంప్ మధ్య సంబంధాల ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మార్పులను తీసుకురావచ్చనే ఆశాభావం ఉంది.

This post was last modified on January 21, 2025 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

10 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

30 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago