Political News

జ్యూరిచ్‌లో ఉన్నామా.. జువ్వ‌ల‌పాలెంలో ఉన్నామా? : లోకేష్

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌దస్సుకోసం వెళ్లిన‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ భ‌ర‌త్‌, ఇత‌ర అధికారుల బృందం.. తొలుత జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ అయింది. ఎన్నారై నేత‌ల ఆధ్వ‌ర్యంలో దావోస్ స‌ద‌స్సుకు వ‌చ్చిన తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌ను తొలుత ఈ స‌ద‌స్సుకు ఆహ్వానించారు. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్త‌లు సుమారు 180 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు కూడా ఉన్నారు. వీరిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్ర‌సంగించారు.

ఈ స‌మావేశానికి వ‌చ్చిన పారిశ్రామిక వేత్త‌ల‌తో హాల్ అంతా నిండిపోవ‌డం.. ప‌లువురు నిల‌బ‌డి ఉండ‌డాన్ని చూసిన మంత్రి నారా లోకేష్.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అంద‌రూ తెలుగు వారేన‌ని.. ఇంతమంది పారిశ్రామిక వేత్త‌లు ఈ జ్యూరిచ్ స‌మావేశానికి రావ‌డం.. చంద్ర‌బాబు ఘ‌న‌తేన‌ని చెప్పుకొచ్చారు. “ఇంత మంది తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌ను చూస్తుంటే.. మేం జ్యూరిచ్‌లో ఉన్నామో.. జువ్వ‌ల పాలెంలో ఉన్నామో.. అన్న సందేహం క‌లుగుతోంది” అని నారా లోకేష్ వ్యాఖ్యానిం చారు. దీంతో స‌మావేశంలో ఒక్క‌సారిగా న‌వ్వులు విరిశాయి.

మా నాన్న విఫ‌ల‌మైనా..

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోనే కాకుండా.. వ్యాపార రంగంలోనూ అనేక ప్ర‌యోగాలు చేశార‌ని నారా లోకేష్ చెప్పారు. “మా నాన్న కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుడిగానే అంద‌రికీ ఎక్కువగా తెలుసు. కానీ, ఆయ‌న‌లో వ్యాపార వేత్త ఉన్నారు. తొలినాళ్ల‌లోనే అనేక వ్యాపారాలు చేప‌ట్టారు. అయితే.. మూడు వ్యాపారాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. చాలా న‌ష్టాలు వ‌చ్చాయి. అయినా వెనుదిర‌గ‌లేదు. ఎంతో ప‌ట్టుద‌ల‌తో హెరిటేజ్‌ను స్థాపించారు. ఇది నాలుగో వ్యాపారం. ఇది ఇప్పుడు లాభాల బాట‌లో సాగుతూ.. ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి చూపిస్తోంది.” అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

ఆ ఘ‌ట‌నతో వ‌ణికి పోయాను!

వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్టి జైల్లో పెట్టార‌ని.. ఆ స‌మ‌యంలో తాను చాలా వ‌ణికి పోయాన‌ని.. నారా లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ, జైల్లో ఉండి కూడా త‌మ‌కు ధైర్యం నూరిపోసిన నాయ‌కుడు చంద్ర‌బాబేన‌న్నారు. ఎంతో మంది తెలుగువారు.. ఏక‌తాటిపైకి వ‌చ్చి.. త‌మ కోసం పోరాటం చేశార‌ని, ఆ సంద‌ర్భాన్ని తాము ఎప్ప‌టికీ మ‌రిచి పోలేమ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రం క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డుతోంద‌ని.. ఈ స‌మ‌యంలోనే తెలుగువారు ఎక్క‌డున్నా రాష్ట్రానికి స‌హ‌కారం అందించాల్సి ఉంద‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పెట్టుబ‌డుల‌కు ఏపీ ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతోంద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ స్పందించాల‌ని ఆయ‌న సూచించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

52 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

6 hours ago