ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం బృందం.. తొలుత జ్యురిచ్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారు అన్ని దేశాల్లో నూ ఉన్నారని వారి ప్రతిభా పాటవాలతో తమదైన గుర్తింపు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రతి విషయంలోనూ ఎంతో నైపుణ్యంతో వ్యవహరిస్తున్నారని.. తద్వారా దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెస్తున్నట్టు చెప్పారు.
తెలుగు వారు చాలా మేధావులు, నైపుణ్యం ఉన్నవారని పేర్కొన్న చంద్రబాబు.. దాదాపు అన్ని దేశాల్లోనూ వారి జాడ కనిపిస్తుందని చెప్పారు. తన కోసం.. గత ఏడాది ఎన్నికలకు ముందు.. అదేవిధంగా తనను జైల్లో అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా.. తనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అండగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే.. తనకు తెలుగు నేల అన్నా.. తెలుగు వారన్నా అభిమానమని పేర్కొన్నారు. మళ్లీ జన్మ అంటూ.. తెలుగు వాడిగానే తాను పుట్టాలనికోరుకుంటున్నట్టు చెప్పారు. అదేవిధంగా యువతకు మంచి భవిష్యత్తు ఉందని.. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అభిలషిస్తున్నానని సీఎం తెలిపారు.
హైదరాబాద్ అందుకే గొప్పది!
తెలంగాణకు హైదరాబాద్ కల్పవృక్షం వంటిదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానన్నారు. అక్కడ తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే ఉందని.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ కీలక ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను ప్రోత్సహించిన ఐటీ రంగం ఇప్పుడు తెలంగాణకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందన్నారు. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహిస్తే.. అనేక మంది విమర్శలు చేశారని చెప్పారు. కానీ, తాను ముందుకే సాగానని, దీంతో హైదరాబాద్కు ఇప్పుడు ఆర్థికంగా ఎంతో ఊతం లభించినట్టు అయిందన్నారు.
యువతులకు పెద్దపీట..
ప్రపంచ వ్యాప్తంగా యువతుల సంఖ్య, వారి నైపుణ్యాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగం లో యువతులకు ప్రాధాన్యం లభిస్తోందన్నారు. యువకుల కంటే కూడా.. యువతుల ఆదాయం మెండుగా ఉందన్నారు. అందుకే.. వారిని అన్ని రంగాల్లోనూ తాను ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. తద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేయనున్నట్టు తెలిపారు. కాగా.. జ్యూరిచ్లో పర్యటన అనంతరం.. దావోస్కు వెళ్లనున్నారు.
This post was last modified on January 20, 2025 8:34 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…