Political News

మ‌రో జ‌న్మంటూ ఉంటే.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోటి నుంచి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు వెలువ‌డ్డాయి. మ‌రో జ‌న్మ అంటూ ఉంటే.. మ‌ళ్లీ తెలుగు వాడిగానే పుట్టాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. తాజాగా దావోస్ పర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం బృందం.. తొలుత జ్యురిచ్‌లో జ‌రిగిన పారిశ్రామిక వేత్త‌ల స‌మావేశంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారు అన్ని దేశాల్లో నూ ఉన్నార‌ని వారి ప్ర‌తిభా పాట‌వాల‌తో త‌మ‌దైన గుర్తింపు తీసుకువ‌స్తున్నార‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో నైపుణ్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. త‌ద్వారా దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెస్తున్న‌ట్టు చెప్పారు.

తెలుగు వారు చాలా మేధావులు, నైపుణ్యం ఉన్న‌వార‌ని పేర్కొన్న చంద్ర‌బాబు.. దాదాపు అన్ని దేశాల్లోనూ వారి జాడ క‌నిపిస్తుంద‌ని చెప్పారు. త‌న కోసం.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. అదేవిధంగా త‌న‌ను జైల్లో అక్ర‌మంగా నిర్బంధించిన‌ప్పుడు కూడా.. త‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అండ‌గా నిలిచార‌ని పేర్కొన్నారు. అందుకే.. త‌న‌కు తెలుగు నేల అన్నా.. తెలుగు వార‌న్నా అభిమాన‌మ‌ని పేర్కొన్నారు. మ‌ళ్లీ జ‌న్మ అంటూ.. తెలుగు వాడిగానే తాను పుట్టాల‌నికోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా యువ‌త‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని.. పారిశ్రామిక వేత్త‌లుగా ఎద‌గాల‌ని అభిల‌షిస్తున్నాన‌ని సీఎం తెలిపారు.

హైద‌రాబాద్ అందుకే గొప్ప‌ది!

తెలంగాణ‌కు హైద‌రాబాద్ క‌ల్ప‌వృక్షం వంటిద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని తాను ఎప్పుడో చెప్పానన్నారు. అక్క‌డ త‌ల‌స‌రి ఆదాయం కూడా ఎక్కువ‌గానే ఉంద‌ని.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు హైద‌రాబాద్ కీల‌క ఆర్థిక వ‌న‌రుగా మారింద‌న్నారు. తాను ప్రోత్స‌హించిన ఐటీ రంగం ఇప్పుడు తెలంగాణ‌కు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోంద‌న్నారు. ఒక‌ప్పుడు ఐటీని ప్రోత్స‌హిస్తే.. అనేక మంది విమ‌ర్శ‌లు చేశార‌ని చెప్పారు. కానీ, తాను ముందుకే సాగాన‌ని, దీంతో హైద‌రాబాద్‌కు ఇప్పుడు ఆర్థికంగా ఎంతో ఊతం ల‌భించిన‌ట్టు అయింద‌న్నారు.

యువ‌తుల‌కు పెద్ద‌పీట‌..

ప్ర‌పంచ వ్యాప్తంగా యువ‌తుల సంఖ్య‌, వారి నైపుణ్యాలు పెరుగుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగం లో యువ‌తుల‌కు ప్రాధాన్యం ల‌భిస్తోంద‌న్నారు. యువ‌కుల కంటే కూడా.. యువ‌తుల ఆదాయం మెండుగా ఉంద‌న్నారు. అందుకే.. వారిని అన్ని రంగాల్లోనూ తాను ప్రోత్స‌హించాలని భావిస్తున్న‌ట్టు సీఎం చెప్పారు. త‌ద్వారా మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా.. జ్యూరిచ్‌లో ప‌ర్య‌ట‌న అనంత‌రం.. దావోస్‌కు వెళ్ల‌నున్నారు.

This post was last modified on January 20, 2025 8:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

1 hour ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

3 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago