Political News

విదేశీ గడ్డపై గురుశిష్యుల కలయిక

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే. బీఆర్ఎస్ తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి… ఆ పార్టీలో అతి తక్కువ కాలమే కొసనాగారు. ఆ తర్వాత నేరుగా టీడీపీలోకి వచ్చి చేరిన రేవంత్ దశ దిశను చంద్రబాబు ఓ రేంజీలోకి తీసుకెళ్లిపోయారు. తొలిసారి ప్రజా ప్రతినిధిగా రేవంత్ కు అవకాశం ఇచ్చింది చంద్రబాబే. వెరసి రేవంత్ కు రాజకీయంగా ఓనమాలు దిద్దించింది చంద్రబాబే. అందుకే కాబోలు… టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్బంగా చంద్రబాబును కలిసి మరీ రేవంత్ తన నిర్ణయాన్ని చెప్పి..పార్టీ మారారు.

సరే… ఇదంతా ఇప్పుడెందుకు గానీ… గురుశిష్యులు ఇద్దరూ ఇప్పుడు విదేశీ గడ్డపై తళుక్కుమన్నారు. న్యూజిల్యాండ్ నగరం దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం ఇద్దరు నేతలు… తమ తమ రాష్ట్రాల ప్రతినిధి బృందాలకు నేతృత్వం వహిస్తూ సోమవారం ఉదయం అక్కడికి సమీపంలోని జ్యూరిచ్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు, సింగపూర్ నుంచి రేవంత్ జ్యూరిచ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను జ్యూరిచ్ ఎయిర్ పోర్టు చేరుకున్న సమయంలో అక్కడే చంద్రబాబు కూడా ఉన్నారని తెలుసుకున్న రేవంత్ వెంటనే ఆయనను కలిసేందుకు వెళ్లారు.

తన వద్దకు వచ్చిన రేవంత్ ను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు నేతల మధ్య కుశల ప్రశ్నలు అయ్యాక… కలిసి కూర్చుని తేనీరు సేవించారు. ఈ సందర్భంగా రేవంత్ వెంట ఉన్న తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును చంద్రబాబు దగ్గరకు పిలిచి ఆయన భుజంపై చేయి వేసుకుని మరీ కులాసాగా గడిపారు. శ్రీధర్ బాబు తండ్రి దివంగత డి. శ్రీపాదరావుతో చంద్రబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. శ్రీపాదరావు కాంగ్రెస్ లో ఉన్నా… సమకాలీన రాజకీయ నేత కావడంతో దివంగత సీఎం వఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి సాగిన శ్రీపాదరావుతో చంద్రబాబు మంచి స్నేహ సంబంధాలను నెరపారు.

ఇక ఈ భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు కాసేపు అలా పిచ్చాపాటిగా కాలక్షేపం చేశారు. తర్వాత ఎవరి పనిలో వారు పడిపోయారు. దావోస్ లో సదస్సు ప్రారంభం అయ్యేలోగానే.. జ్యూరిచ్ లోనే కార్యరంగంలోకి దిగిపోనున్న ఇద్దరు సీఎంలు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను రాబట్టే పనిని మొదలు పెట్టేశారు.

This post was last modified on January 20, 2025 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

21 minutes ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

32 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

1 hour ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

4 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago