ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది అధికారుల పరిశీలన, అనేక శాఖలతో ముడిపడిన వ్యవహారాలకు అనుమ తులు.. వంటివి ప్రధానంగా సమయాన్నిమింగేస్తాయి. అందుకే ఒక్కొక్క సారి సాక్షత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు చెప్పినా.. ఆయా పనులు ఏళ్ల తరబడి ఆలస్యమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ సమయాభావాన్ని తగ్గించేస్తున్నారు.
మంత్రులు.. ముఖ్యమంత్రిగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేసేలా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఒక విధంగా జవాబుదారీ తనానికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో సీఎం అయినా.. డిప్యూటీ సీఎం అయినా.. ఏదైనా విషయంపై అలా చెప్పగానే.. సంబంధిత అధికారులు ఇలా చేస్తున్నారు. పెద్దగా సమయం తీసుకోకుండానే 24 గంటల్లోనే సాధ్యమైనంత వరకు పనులు చేస్తున్నారు. తాజాగా శనివారం(18వ తేదీ) చంద్రబాబు ఇచ్చిన హామీని ఆదివారం సాయంత్రానికి అధికారులు నెరవేర్చారు.
ఏం జరిగింది?
శనివారం కడప జిల్లా మైదుకూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘స్వర్ణ ఆంధ్రా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా.. స్వచ్ఛత దివస్ కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో స్థానిక వినాయకనగర్ కు చెందిన వేల్తుర్ల విష్ణు వందన నివాసాన్ని సందర్శించారు. చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చన్న ప్రభుత్వ సూచనలను ఈ కుటుంబం పాటించడాన్ని చూసి చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన గృహిణి విష్ణు వందనను అభినందించారు.
ఈ సందర్భంగా వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వందన కుటుంబ జీవనం మెరుగుపడేందుకు ప్రభుత్వ సాయం కోరుతూ ఆమె వినతి పత్రాలు అందించారు. వీటిని పరిశీలించిన సీఎం తక్షణం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో 24 గంటలలోపే ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని పనులు అయ్యాయి. ఈ కుటుంబానికి సంబంధించి మొత్తం పలు వినతులు అందగా.. రెండింటిని వెంటనే పరిష్కరించారు.
కుటుంబలోని ఒకరికి వృద్దాప్య పెన్షన్ మంజూరు చేశారు. ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్ణు వందనకు డీఆర్డీఏలో ఔట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగ అవకాశం కల్పించారు. మొత్తానికి సీఎం చంద్రబాబు అలా హామీ ఇవ్వగానే అధికారులు ఇలా పూర్తి చేయడంపై విష్ణు వందన కుటుంబం హ్యాపీగా ఫీలవడం గమనార్హం.
This post was last modified on January 20, 2025 2:49 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…